TDP : ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ..

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ నేతలు హాజరయ్యారు. దాదాపు 20 అంశాలపై చర్చ జరగనుంది.

Updated : 28 Mar 2023 12:31 IST

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ నేతలు హాజరయ్యారు. దాదాపు 20 అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం- కష్టాల్లో రైతాంగం; రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు; సభ్యత్వ నమోదు; పార్టీ సంస్థాగత బలోపేతం, సాధికార సారథులు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన 11 కమిటీల వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని