మెట్రో రెండోదశ విస్తరణం
మెట్రోరైలు రెండోదశకు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. దీంతో ప్రాజెక్ట్ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల కాక
ఈనాడు, హైదరాబాద్: మెట్రోరైలు రెండోదశకు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. దీంతో ప్రాజెక్ట్ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. అసలు రాష్ట్రం కేంద్రాన్ని ఏం కోరింది? అందుకు కేంద్రం ఏం సమాధానమిచ్చింది? అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి.
* 2022 అక్టోబరు 27న మెట్రో రెండోదశ(బి) బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్(26కి.మీ.), నాగోల్ నుంచి ఎల్బీనగర్(5 కి.మీ.) మార్గాల డీపీఆర్, ఇతర పత్రాలను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ కేంద్రానికి సమర్పించారు. అనుమతిస్తూ నిధులు మంజూరు చేయాలని కోరారు.
* 2022 నవంబరు 14న రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మెట్రోరైలు రెండోదశ(బి)ను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం వాటాతో సంయుక్త ప్రాజెక్ట్గా చేపట్టేందుకు అనుమతిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ శారు.
* సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను అధ్యయనం చేసిన కేంద్రం 14 అంశాలపై తమ పరిశీలనలను రాష్ట్ర పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్కు డిసెంబరు1, 2022న పంపింది. సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ సహచట్టం కింద కేంద్రానికి దరఖాస్తు చేయగా కేటీఆర్ రాసిన లేఖ, కేంద్రం లెవనెత్తిన సందేహాలు, పరిశీలన లేఖలు బయటికి వచ్చాయి. ఈ లేఖల్లో లేెవనెత్తిన అంశాలన్నీ సాంకేతికత పరమైనవని.. ఇప్పటికే సమాధానమిచ్చామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ‘ఈనాడు’తో అన్నారు. ఇంకా కొన్ని పత్రాలు లేవని కేంద్రం అంటోందని.. వాటిని సైతం మళ్లీ పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రధాన పరిశీలనలు.. రాష్ట్రం సమధానాలివి
కేంద్రం పరిశీలన: నవంబరు 2018 ధరల ప్రకారం డీపీఆర్ రూపొందించారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 2019లో వచ్చాయి. ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రకారం సవరించి(అప్డేట్)న డీపీఆర్ను పంపించండి.
రాష్ట్రం సమాధానం: సవరించిన ధరలతో డీపీఆర్ను అప్డేట్ చేసి ఇప్పటికే పంపించాం.
కేంద్రం పరిశీలన: ప్రత్యేక సంస్థ ఏర్పాటు ఉండాలి(ఎస్పీవీ)
రాష్ట్రం సమాధానం: ఇప్పటికే మెట్రోకి సంబంధించి రెండు ఎస్పీవీలు ఉన్నాయి. మీరు ఆమోదిస్తే వీటిలో ఒకదాన్ని ఈ ప్రాజెక్ట్కు ఎస్పీవీగా మారుస్తాం.
కేంద్రం పరిశీలన: ప్రాజెక్ట్ వ్యయంలో కంటిన్జెన్సీ కింద 3 శాతం అన్నింటి మీద లెక్కకట్టారు. కొన్నింటికే ఇది వర్తిస్తుంది.
రాష్ట్రం సమాధానం: కేంద్రం అభ్యంతరాల మేరకు అనుమతి ఇచ్చిన వాటి వరకు కంటిన్జెన్సీ వర్తించేలా మార్పులు చేసి పంపించాం. (తెలియని ఖర్చుల కోసం కేటాయించే మొత్తాన్ని కంటిన్జెన్సీ కింద చెబుతుంటారు).
కేంద్రం పరిశీలన: 2020లో ఆత్మనిర్భర్ భారత్ ప్రకారం ప్రాజెక్ట్లో వాడే సామగ్రి దేశీయ ఉత్పత్తుల వాటా నిర్ణీత స్థాయిలో ఉండాలి.
రాష్ట్రం సమాధానం: ఆ మేరకు చేస్తున్నాం.
కేంద్రం పరిశీలన: ప్రతిపాదిత విస్తరణ మార్గంలో రద్దీ సమయంలో రైడర్షిప్ అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్కు న్యాయం చేయలేరు. దీనికి సప్లిమెంట్ చేయడానికి ఇతర విధానాలలో కానీ, ఫీడర్ సర్వీసులు కానీ ఉండాలి. వాటి ప్రణాళికలు, కారిడార్ల ప్రతిపాదనలు పంపండి.
రాష్ట్రం సమాధానం: నిర్దేశిత ప్రయాణాల సగటు కంటే రెండోదశలో రైడప్షిప్ ఎక్కువే ఉంది.
కేంద్రం పరిశీలన: మెట్రోపాలసీ 2017 ప్రకారం తప్పనిసరిగా యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని ఏర్పాటు చేయాలి. అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలి.
రాష్ట్రం సమాధానం: రాష్ట్రంలో ఇప్పటికే యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..