ఆక్రమణలపై ఉక్కుపాదం
నకిలీ భూ దస్త్రాలు సృష్టించి హెచ్ఎండీఏ స్థలాలను కాజేయడానికి రియల్ వ్యాపారులు వేసిన ఎత్తుగడలను ఉన్నతాధికారులు చిత్తు చేశారు.
ఆపరేషన్ శంషాబాద్ విజయవంతం
పొక్లెయిన్తో నిర్మాణాల ధ్వంసం
శంషాబాద్, న్యూస్టుడే: నకిలీ భూ దస్త్రాలు సృష్టించి హెచ్ఎండీఏ స్థలాలను కాజేయడానికి రియల్ వ్యాపారులు వేసిన ఎత్తుగడలను ఉన్నతాధికారులు చిత్తు చేశారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్లో జాతీయ రహదారికి ఆనుకొని హెచ్ఎండీఏకు చెందిన 50 ఎకరాలపై కొంత మంది రియల్ వ్యాపారుల కన్నుపడింది. నకిలీ భూ దస్త్రాలు సృష్టించి దాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఈ వ్యవహారం హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయం సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బెంగళూర్ జాతీయ రహదారి- ఔటర్ సర్వీస్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులను 5 గంటల పాటు పూర్తిగా మూసివేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 6 యంత్రాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఆపరేషన్లో 15 మంది హెచ్ఎండీఏ ఎస్టేట్ అధికారులు, సిబ్బంది.. 50 మంది ఎన్ఫోర్స్మెంట్ భద్రతాసిబ్బంది, 20 మంది సైబరాబాద్ పోలీసులు, 10 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు