logo

మంత్రి మల్లారెడ్డితో రైతుల వాగ్వాదం

ఘట్‌కేసర్‌లో మంగళవారం నిర్వహించిన రైతు సహకార సంఘం సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగానికి రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.

Published : 29 Mar 2023 02:09 IST

భాజపా నాయకుడు మహిపాల్‌రెడ్డిని   బయటకు తీసుకెళ్తున్న సీఐ అశోక్‌రెడ్డి

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: ఘట్‌కేసర్‌లో మంగళవారం నిర్వహించిన రైతు సహకార సంఘం సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగానికి రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా.. కొందరు కర్షకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి భాజపాకు చెందిన ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. దీంతో మంత్రికి కోపం వచ్చి.. ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదని, ఇక్కడి నుంచి బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు వారిని బయటకు పంపించారు. కొద్ది సేపు భారాస, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మంత్రి తన ప్రసంగం మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని