వేసవి ప్రయాణం మరింత సురక్షితం
వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు విహార, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి.
రైళ్లు, స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే
వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు విహార, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ప్రయాణికుల ఏమరపాటును అవకాశం చేసుకొని దొంగలు, అంతర్రాష్ట్ర ముఠాలు చెలరేగుతుంటాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే పోలీసులు ముందుగానే సిద్ధమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సురక్షిత ప్రయాణానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ షేక్ సలీమా తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లు, రైల్వేస్టేషన్లలో 500మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..
రైల్వేస్టేషన్లలో భద్రత, రైళ్లలో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చే 300 మంది సివిల్, ఏఆర్, రైల్వేస్టేషన్ల సిబ్బందితో కలిసి 500 మందితో భద్రత కొనసాగుతుందని చెప్పారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో, రైళ్లలో తరచూ తనిఖీలు చేస్తామన్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులను గుర్తిస్తే డయల్ 100, జీఆర్పీ కంట్రోల్ టోల్ఫ్రీ 1512కు సమాచారం అందించాలని సూచించారు.
*ప్రయాణికుల వద్ద విలువైన ఆభరణాలు, వస్తువులు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
* అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండరాలు, పానీయాలు తీసుకోవద్దు.
* చాలా మంది ప్రయాణ సమయంలో మెడలోని ఆభరణాలు తీసి బ్యాగులో ఉంచుతున్నారు. వాటినే దొంగలు చోరీ చేస్తున్నారు. సెల్ఫోన్లు ఛార్జింగ్ పెట్టి నిద్రపోవటం, ఏమరుపాటుగా ఉండటంతో దొంగలు తేలికగా కొట్టేస్తున్నారు.
* కిటికీ పక్కన కూర్చున్న సమయంలో బయట నుంచి మహిళల మెడలోని అభరణాలను దొంగలు లాక్కెళ్తున్నారు. ముందు జాగ్రత్తగా కిటికీలను మూసి ఉంచాలి
దంపతుల మరణం బాధాకరం
సోమవారం హైదరాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో రైలు పట్టాలు దాటుతూ వృద్ధ దంపతులు మరణించడం చాలా బాధాకరమన్నారు. త్వరగా గమ్యం చేరాలనే ఆత్రుత, దగ్గరదారి అనే ఆలోచనతో చాలామంది పట్టాలు దాటుతున్నారన్నారు. కొందరు సెల్ఫోన్ మాట్లాడుతూ ఏమరుపాటుగా ఉంటారన్నారు. రైల్వేస్టేషన్లలో ఫ్లాట్ఫామ్ వైపునకు వెళ్లేందుకు ఉన్న మార్గాలనే వినియోగించుకోవాలని, ఫుట్ఓవర్ బ్రిడ్జిలపై నుంచి మాత్రమే ప్లాట్ఫామ్ల మీదకు చేరాలన్నారు.
రాళ్లు విసిరే వారిపై కేసులు
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్లపై కొందరు రాళ్లు విసురుతుండటంతో తరచూ అద్దాలు పగిలిపోతున్నాయి. ఇటువంటి చర్యలు ప్రయాణికులకు హాని కలిగిస్తున్నాయని, బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల ధ్వంసం చట్టరీత్యా నేరమని, రైల్వే చట్టాలు కఠినంగా ఉంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.