logo

ప్రజా భద్రతకు ప్రాణాలిచ్చిన గొప్ప వ్యక్తి ఉమేష్‌చంద్ర

దేశ సమగ్రత, ప్రజల భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఉమేష్‌చంద్ర అని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:27 IST

ఉమేష్‌చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న డీజీపీ అంజనీకుమార్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: దేశ సమగ్రత, ప్రజల భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఉమేష్‌చంద్ర అని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. దివంగత ఐపీఎస్‌ అధికారి చదలవాడ ఉమేష్‌చంద్ర జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఎస్సార్‌నగర్‌ చౌరస్తాలో నిర్వహించారు. చౌరస్తాలోని ఉమేష్‌చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసిన డీజీపీ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం పనిచేసిన ఉమేష్‌చంద్ర పోలీసు యంత్రాంగానికి స్ఫూర్తిదాతగా నిలిచారని చెప్పారు. తాను, ఉమేష్‌చంద్ర ఇద్దరం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అసిస్టెంట్‌ ఎస్పీలుగా తమ కెరీర్‌ ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో ఉమేష్‌చంద్ర తండ్రి వేణుగోపాలరావు, పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌, ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, డీఐ రాంప్రసాద్‌రావు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, ఎస్సార్‌నగర్‌ ఠాణాకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని