logo

ద్విచక్రవాహనాలు ఢీకొని బాలుడి దుర్మరణం

రెండు బైకులు ఢీకొని ఓ బాలుడు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండలంలోని రుక్కుంపల్లి స్టేజీ పరిసరాల్లో బుధవారం రాత్రి జరిగింది.

Published : 30 Mar 2023 02:27 IST

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: రెండు బైకులు ఢీకొని ఓ బాలుడు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండలంలోని రుక్కుంపల్లి స్టేజీ పరిసరాల్లో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంజనేయులు తన కుమారుడు శశాంక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బుధవారం సాయంత్రం పరిగి వైపు నుంచి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వికారాబాద్‌ వైపు నుంచి పరిగి పట్టణానికి చెందిన నరేంద్ర (వికారాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) ద్విచక్ర వాహనంపై పరిగికి తిరిగి వస్తున్నాడు. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీ కొన్నాయి. దీంతో ఈప్రమాదంలో బాలుడు శశాంక్‌(11) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఓప్రైవేటు పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని