వేగంగా పడిపోతున్న శ్రీశైలం తిరుగుజలాలు
శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.
వేసవిలో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం
ఎల్లూరు జలాశయం వద్ద భగీరథ ప్లాంటు
న్యూస్టుడే, కొల్లాపూర్: శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం భగీరథ పథకం ఎస్ఈ వెంకటరమణ, ఈఈలు, డీఈలు తదితరులు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు భగీరథ పథకం దగ్గర నీటి సరఫరా సమీక్షించారు. ప్రధానమైన రేగుమాన్గడ్డ తీరంలో 808.80 అడుగుల మేరకే శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు
గుర్తించారు. ఏప్రిల్, మే, జూన్, జులై వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం అధికారులు తగినంత ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులున్నాయి.
విద్యుదుత్పత్తి నిలిపివేస్తేనే..
తెలుగు రాష్ట్రాల పరిధిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ప్రాంతంలో విద్యుదుత్పత్తి నిలిపివేస్తే కొంతైనా తిరుగుజలాలు నిల్వ ఉంటాయి. ఏపీలో విద్యుత్తు ఉత్పత్తికి ప్రతి రోజు 2,500 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారు. నాగార్జునసాగర్లో ప్రస్తుతం 531 అడుగుల మేర నీళ్లు నిల్వఉన్నాయి. గతేడాది శ్రీశైలంనుంచి రివర్స్ పంపింగ్ చేసి 4 టీఎంసీలు వెనక్కు తీసుకొచ్చారు. అప్పట్లో నాగార్జునసాగర్లో 540 అడుగుల మేర నిల్వ ఉండటంతో అది సాధ్యమైంది. ఈ వేసవిలో సాగర్లోనే నీటి నిల్వ తగ్గిపోతోంది. దీంతో రివర్స్ పంపింగ్కు ఇబ్బందులు నెలకొన్నాయి.
6 జిల్లాల పరిధిలో..
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు జలాశయం వద్ద మిషన్ భగీరథ పథకం నుంచి నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 19 పురపాలికలు, 4 వేలకుపైగా గ్రామాలకు తాగునీరు అందుతోంది. రోజు 632 లక్షల లీటర్ల నీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో శ్రీశైలం తిరుగుజలాలు వేగంగా తగ్గిపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. ఎల్లూరు జలాశయం 0.35 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భగీరథ ఎస్ఈ వెంకటరమణ స్పందిస్తూ.. శ్రీశైలం తిరుగుజలాల నిల్వ, ఎల్లూరు పథకం పరిస్థితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!