logo

స్నేహితుడికి సాయం చేసేందుకు వెళ్తూ..

ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందాడు. కుషాయిగూడ ఎస్‌ఐ ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం..

Published : 31 Mar 2023 02:44 IST

బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి

కాప్రా, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందాడు. కుషాయిగూడ ఎస్‌ఐ ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. చర్లపల్లి డివిజన్‌లోని మధుసూదన్‌రెడ్డినగర్‌ ప్లాట్‌ నంబరు 36లో ఉంటున్న కోడిమల్ల ప్రణయ్‌(27) రాంపల్లిలోని దేవాన్ష్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో వెల్డర్‌. ద్విచక్ర వాహనంలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్నానంటూ గురువారం తెల్లవారుజామున ఓ మిత్రుడు ఫోన్‌ చేసి సాయం కోరాడు. దీంతో మరో స్నేహితుడి బైక్‌ తీసుకుని ప్రణయ్‌ ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు వెళ్తున్నాడు. బీఎన్‌రెడ్డి కాలనీ కూడలిలోని గణేష్‌ కమాన్‌ దాటాక పెట్రోల్‌బంక్‌ మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డుపై పడిపోయిన ప్రణయ్‌ తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని