logo

పెట్టుబడికి లాభాలంటూ రూ.4 కోట్లు మోసం

సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ సంస్థ యజమాని ఏకంగా రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల వివరాల ప్రకారం..

Published : 31 Mar 2023 02:44 IST

ఈనాడు- హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ఓ సంస్థ యజమాని ఏకంగా రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువకుడు బీటెక్‌ పూర్తి చేసి.. ఓ సంస్థను ప్రారంభించాడు. కొద్దికాలంలో మంచి లాభాలు వచ్చాయి. ఇటీవల అతనికి సామాజిక మాధ్యమాల్లో ఓ సందేశం వచ్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించొచ్చని అందులో ఉంది. అది నమ్మి కొంత డబ్బు పంపించాడు. ప్రారంభంలో లాభాలు రావడంతో రెండు నెలల్లో దాదాపు రూ.4 కోట్లు పంపించాడు. కొన్ని రోజుల తర్వాత స్పందన లేకపోవడంతో  సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని