logo

Hyderabad News: ప్రేమ పేరిట వల.. మైనర్‌పై అత్యాచారం

 బాలికను అపహరించుకుపోయి బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.30వేల జరిమానా విధించింది.

Updated : 01 Apr 2023 08:45 IST

దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే:  బాలికను అపహరించుకుపోయి బలవంతంగా గుడిలో పెళ్లి చేసుకొని అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.30వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.3లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీశ శుక్రవారం తుది తీర్పునిచ్చారు. అదనపు పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ముకు చెందిన ఆలేటి ప్రభాకర్‌ (29) బతుకుదెరువుకు నగరానికి వలస వచ్చి మీర్‌పేట ఠాణా పరిధిలోని ఓ కాలనీలో ఉంటున్నాడు. ప్రభాకర్‌ 2016లో ఓ బాలిక(16)ను ప్రేమిస్తున్నట్లు మాయమాటలు చెప్పాడు. 2016 జూన్‌ 5న ఆమెను అపహరించుకుపోయాడు. తుక్కుగూడలోని ఓ ఆలయంలో బలవంతంగా పెళ్లి చేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని