logo

బాలికపై వీధి కుక్కల దాడి

గాజులరామారం డివిజన్‌ పరిధి మల్లారెడ్డినగర్‌ సమీపంలోని చెన్నకేశవనగర్‌లో బాలికపై వీధి కుక్కలు దాడిచేశాయి.

Published : 01 Apr 2023 02:47 IST

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: గాజులరామారం డివిజన్‌ పరిధి మల్లారెడ్డినగర్‌ సమీపంలోని చెన్నకేశవనగర్‌లో బాలికపై వీధి కుక్కలు దాడిచేశాయి. బాలిక గురువారం ఉదయం 7 గంటలకు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్తుండగా నాలుగు శునకాలు ఒక్కసారిగా తనపై ఎగబడ్డాయి. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని బాలికను కుటుంబ సభ్యులు షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. లోతైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులపై తరచూ శునకాలు దాడి చేస్తున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వాటిని తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని