logo

గోసంరక్షణ బిల్లు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి

గోసంరక్షణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు కోరాయి.

Published : 01 Apr 2023 03:01 IST

కాశీ సుమేరు పీఠాధిపతిని కలిసిన ఆర్‌కే జైన్‌, జస్మత్‌పటేల్‌ తదితరులు

కాచిగూడ: గోసంరక్షణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు కోరాయి.  శుక్రవారం కాచిగూడకు చెందిన తెలంగాణ లవ్‌ఫర్‌కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌జాగిర్దార్‌, అఖిల భారత పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఆర్‌కే జైన్‌, తదితరులు కాశీ సుమేరు పీఠాధిపతి అనంత్‌ శ్రీవిభూషిత్‌ జగద్గురు శంకరాచార్యస్వామి నరేంద్రానంద సరస్వతిజీని  సీతారామ్‌బాగ్‌ జగన్నాథస్వామి మఠంలో కలిసి గోసంరక్షణ బిల్లు ఉద్యమానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని