రసాయనం.. నేల నిస్సారం
అధిక దిగుబడులు సాధించాలన్న తపనతో అన్నదాతలు ఎడాపెడా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. పంట ఉత్పత్తులపై పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తే మేలు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
వరి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు
అధిక దిగుబడులు సాధించాలన్న తపనతో అన్నదాతలు ఎడాపెడా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. పంట ఉత్పత్తులపై పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది మోతాదుకు మించడంతో తిండి గింజలు విషతుల్యంగా మారుతున్నాయి. నేల స్వభావానికి అనువుగా వాడాలన్న అవగాహన లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇక భూసార పరీక్షలను వ్యవసాయ శాఖ గాలి కొదిలేసింది. సొంత అనుభవాలతో రసాయన ఎరువుల వాడకం జోరుగా సాగుతోంది. దీనివల్ల పెట్టుబడుల భారం పెరుగుతుండగా నేల సారం కోల్పోయేందుకు దారితీస్తోంది.
జిల్లాలో ఇరవై మండలాల్లోని 2.36లక్షల మంది రైతులు ఖరీఫ్ సీజన్లో 5.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రబీలో 1.49 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇవి దెబ్బతినకుండా ఉండేందుకు, అధిక ఉత్పత్తులు పొందేందుకు యూరియా, డీఏపీ, ఎమ్ఓపీ, ఎన్పీకేఎస్, ఎస్ఎస్పీలను వాడుతున్నారు. నేలల స్వభావాన్ని బట్టి వాడాల్సి ఉండగా, సొంత అనుభవాలు, దుకాణదారుల సూచనల మేరకు వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. నేల సారం కోల్పోయి నాణ్యమైన దిగుబడులు పొందే వీల్లేకుండాపోయింది. అధిక మోతాదులో ఎరువులు, రసాయన మందులు వాడిన పంట ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న ప్రజలు దీర్ఘకాల వ్యాధుల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు.
భూసార పరీక్షలతో కట్టడి
వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఎరువులు, పురుగు మందులను వాడేలా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఏటా వేసవిలో పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేశాక ఫలితాల కార్డులను రైతులకు పంపిణీ చేసేవారు. అయితే మూడేళ్లుగా ఈ ప్రక్రియ సాగడంలేదు. గతంలో వికారాబాద్, పరిగిలో ప్రయోగశాలలు ఉండటంతో ఫలితాల రాకకు నిరీక్షించాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు సర్కారు వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ ఇచ్చి భూసార పరీక్షల కిట్లను పంపిణీ చేసింది. వీటితో మండలాల్లోనే పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. ఏడాదిపాటు ఇది సజావుగా సాగింది. అనంతరం అటకెక్కింది.
ఉన్నతాధికారులు ఆదేశిస్తే చేయిస్తాం
- రుద్రమూర్తి, సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ, తాండూరు.
ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తే విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తాం. గతంలో పంపిణీ చేసిన కిట్లలో రసాయనాల గడువు తీరింది. మళ్లీ కొత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. గతేడాది నియోజకవర్గంలోని చెన్నారంలో మాత్రమే పరీక్షలు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM