logo

సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనం

నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

Updated : 02 Apr 2023 05:05 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబ్‌పేట: నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధి ఎక్‌మామిడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గంలోనే మండలానికి అధిక నిధులు వెచ్చించామని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, సర్పంచి రఫీ, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఏఏంసీ, నవాబుపేట, ఎక్‌మామిడి పీఏసీఎస్‌ ఛైర్మన్లు డా.ప్రశాంత్‌గౌడ్‌, పోలీస్‌ రాంరెడ్డి, పాపిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని