logo

ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌పై కేసు

విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌పై అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 02 Apr 2023 03:12 IST

బేగంబజార్‌, న్యూస్‌టుడే: విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌పై అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ఇటీవలే సిద్దిఅంబర్‌బజార్‌ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఎస్సై వీరబాబు ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌ లోథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని