logo

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి రోగి దుర్మరణం

చికిత్స పొందుతున్న ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ రోగి దుర్మరణం పాలయ్యాడు.

Published : 02 Apr 2023 03:12 IST

శంషాబాద్‌: చికిత్స పొందుతున్న ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ రోగి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన శంషాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం, ముద్దెంగూడకు చెందిన సర్గుట్ల యాదయ్య(46), ఇంద్రమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. భూవివాదం కారణంగా మనస్తాపం చెందిన యాదయ్య గత నెల 27న పురుగు మందు తాగాడు. శంషాబాద్‌లోని ట్రైడెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మతి స్థిమితం కోల్పోయి శనివారం ఆసుపత్రిలోని  పరికరాలు ధ్వంసం చేస్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. వారిని తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని