సరిపోరు.. సమస్యలు పట్టవు
జిల్లాలో రేషన్ డీలర్ల పోస్టులు భర్తీకాక పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి ప్రత్యేకంగా డీలర్ను నియమించాలని ప్రజలు ఏళ్లుగా కోరుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలుచోట్ల వాపోతున్నారు.
డీలర్ల కొరతతో పంపిణీకి వెత
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీ, తాండూరు
రేషన్ దుకాణం వద్ద వేచిచూస్తున్న వినియోగదారులు
జిల్లాలో రేషన్ డీలర్ల పోస్టులు భర్తీకాక పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి ప్రత్యేకంగా డీలర్ను నియమించాలని ప్రజలు ఏళ్లుగా కోరుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలుచోట్ల వాపోతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
59 పోస్టులు ఖాళీ: ఆయా మండలాల్లో 59 గ్రామాల్లో రేషన్ డీలరు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈవిషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పలు చోట్ల పదేళ్లకు పైబడి ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తమవల్ల కాదని చెబుతున్నా అధికారులు ఉన్నవారిపై ఒత్తిడి తీసుకువచ్చి నెట్టుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి.
* అధికారులు పక్క గ్రామాల డీలర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో కొందరు వారంలో 3 లేదా 4 రోజులు మాత్రమే తీస్తున్నారు. అనుబంధ గ్రామాల ప్రజలు పలుచోట్ల వాగులు దాటి సరకులు తీసుకుందామని వెళ్తే దుకాణం తెరవ పోవడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో డీలర్లను నియమించి సొంత గ్రామంలోనే సరఫరా చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
క్వింటాలుకు కమీషన్ కేవలం 70 పైసలు రేషన్ దుకాణాల ద్వారా గతంలో బియ్యంతో పాటు కందిపప్పు, మంచినూనె, ఉప్పు, కారంపొడి, పసుపు, గోధుమపిండి, చింతపండు వంటి తొమ్మిది రకాల సరకులు సరఫరా జరిగేది. రానురాను అవన్నీ తగ్గి కేవలం బియ్యంతో సరిపెడుతున్నారు. ఈ కారణంగా డీలర్లకు వచ్చే కమీషన్ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం క్వింటాలు బియ్యానికి 70పైసలు మాత్రమే అందజేస్తోంది. ఇదేమాత్రం సరిపోవడంలేదని డీలర్లు వాపోతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో పది క్వింటాళ్ల బియ్యం కోటా ఉంటే రూ.7వేలు అందుతాయి. రవాణా ఛార్జీలు, హమాలీ పోను తమకేమీ గిట్టుబాటు కావడం లేదని డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో ఇంఛార్జి గ్రామాలపై విముఖం వ్యక్తం చేస్తున్నారు.
* మొత్తం చౌకధరల దుకాణాలు.. 588
* తెల్ల రేషన్ కార్డులు.. 2,14,530
* అంత్యోదయ.. 26,698
* అన్నపూర్ణ కార్డులు.. 36
* నెలకు బియ్యం పంపిణీ.. 50000 క్వింటాళ్లు
త్వరలో భర్తీ చేస్తాం
- రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి
ఖాళీగా ఉన్న డీలరు పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈక్రమంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రెండు మూడు నెలల్లోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. సరకుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సమీప గ్రామాలకు చెందిన డీలర్లకు అదనపు బాధ్యతలను అప్పగించాం.
ప్రమాద బీమా వర్తింపజేయాలి
జూకారెడ్డి, జిల్లా, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు
దాదాపు ఎనిమిదేళ్లుగా అనేక ఇబ్బందులతో సరకులు పంపిణీ చేస్తున్నాం. కరోనా సమయంలో పలువురు డీలర్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా బాధిత కుటుంబాలకు డీలరు షిప్పును కేటాయించాలి. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.10లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఉద్యోగులుగా గుర్తించడం, కమీషన్ పెంచి ఆదుకోవడం వంటి చర్యలు చేపట్టి అండగా నిలవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం