పేరుకుపోయిన అవినీతి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తుంటే.. పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది సంబంధిత ధ్రువపత్రాలివ్వడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
రూ. 2 వేలు ఇవ్వకపోతే జనన దరఖాస్తులను తిరస్కరిస్తున్న బల్దియా సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తుంటే.. పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది సంబంధిత ధ్రువపత్రాలివ్వడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కనీసం రూ.2వేలు ఇవ్వాల్సిందేనంటూ దళారులతో బేరాలు సాగిస్తున్నారు. దళారుల్లేని దరఖాస్తులు, ముఖ్యంగా నగరంలోని వేర్వేరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులకు సంబంధించినవి 50శాతం మేర తిరస్కరణకు గురవుతున్నాయంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. లంచం ముట్టని దరఖాస్తులను తిరస్కరించడం లేదా పేర్లు తప్పుగా నమోదుచేసి ధ్రువపత్రాలు ఇవ్వడం కొందరు సిబ్బందికి అలవాటుగా మారింది. అచ్చు తప్పులతో ధ్రువపత్రాలు అందుకున్న తల్లిదండ్రులు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.
దోపిడీకి గురవుతున్న పేదలు
* రాష్ట్రం నలుమూలల నుంచి గర్భిణులు కాన్పు కోసం నగరంలోని పలు ఆస్పత్రులను సంప్రదిస్తుంటారు. పేద, మధ్య తరగతి కుటుంబాలవారు నీలోఫర్, పేట్లబుర్జు, గాంధీ, ఉస్మానియా, కింగ్కోఠి ప్రసూతి వైద్యశాలలను ఆశ్రయిస్తుంటారు. వాటితో పాటు నగరంలోని వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో రోజూ వందలాది జననాలు నమోదవుతున్నాయి.
* ఆస్పత్రుల్లో జన్మించిన చిన్నారులకు జనన ధ్రువపత్రం తీసుకోవాలంటే.. రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రం నుంచైనా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్పత్రులు అప్పటికే బల్దియాకు జననాల వివరాలు ఇచ్చి ఉంటాయి. ఆ సమాచారంతో సరిపోల్చుకుని.. జీహెచ్ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేస్తారు. వాటిని రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రంలోనైనా ముద్రించుకోవచ్చు. కింగ్కోఠి, నీలోఫర్, గాంధీ, పేట్లబుర్జు, ఉస్మానియా, పలు ఇతర ఆస్పత్రుల్లోని జననాలకు అలా జరగట్లేదు. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివరాలు నమోదుచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
కేంద్రం చెప్పినా పట్టించుకోలే..
జీహెచ్ఎంసీలోని జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జనన, మరణాల నమోదు చట్టంపై ఉన్నతాధికారులకు పట్టు లేదు. ఈ విషయంలోనే గతంలో కేంద్ర సర్కారు బల్దియాకు అక్షింతలు వేసింది. సొంతంగా అవలంభిస్తున్న విధానంతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు అందిస్తున్న సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని, నకిలీలు ఉండవని, జనాభాపై స్పష్టత వస్తుందని వేర్వేరు అంశాలతో లేఖ రాసింది. బల్దియా అధికారులు ఆ లేఖను పట్టించుకోలేదు.
* బల్దియా సిబ్బంది కొంతకాలంగా రోజూ 100 నుంచి 200 జనన ధ్రువపత్రాల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, అక్కడ సమర్పించిన దరఖాస్తులను జీహెచ్ఎంసీలో ఇవ్వాలని అడుగుతున్నారు. ఇటీవల పార్శిగుట్టకు చెందిన ఓ వ్యక్తి.. తన కొడుకు జనన ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడు సార్లు తిరస్కరించారు. సంతకం సరిపోలట్లేదని, దస్త్రాలు కనిపించడం లేదని, అఫిడవిట్ నోటరీ చేయించలేదనే కారణాలతో తిరస్కరిస్తున్నారు.
* కొన్ని సందర్భాల్లో బల్దియా సిబ్బంది.. దరఖాస్తుదారుల పేర్లను సర్టిఫికెట్లపై తప్పుగా నమోదుచేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారు ఒక్కోసారి రూ.200కుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు