నిబంధనలకు తిలోదకం ప్రాణాలతో చెలగాటం
గ్రేటర్ పరిధిలో, శివారు ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లో ఉన్న కొన్ని ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వదిలేస్తున్న హానికర వ్యర్థాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది.
గ్రేటర్లో పరిశ్రమలపై పీసీబీ కొరడా
ఈనాడు, హైదరాబాద్
గ్రేటర్ పరిధిలో, శివారు ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లో ఉన్న కొన్ని ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వదిలేస్తున్న హానికర వ్యర్థాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. పీసీబీ టాస్క్ఫోర్స్ తనిఖీల్లో అలాంటి 9 పరిశ్రమలను గుర్తించి వాటిని మూసివేయాలని ఆదేశించింది. కావాల్సిన అనుమతులు తీసుకోకుండా, హానికర వ్యర్థాలను నేరుగా వదిలేస్తున్న పరిశ్రమలపై ఫిర్యాదులొస్తే ఉపేక్షించేంది లేదని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
ఉదంతాలివీ... రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్న కాన్కోర్డ్ డ్రగ్స్ లిమిటెడ్ పరిశ్రమ ప్రతిరోజూ 50వేల క్యాప్సూల్స్, 3 లక్షల మాత్రలు, 40వేల ఇంజెక్టబుల్స్, 5కిలోలీటర్ల హ్యాండ్ శానిటైజర్, సర్జికల్ స్పిరిట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమ నుంచి హానికర వ్యర్థాలు విడుదలవుతున్నాయని జనవరి నెలలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకొచ్చి పారబోస్తున్నారంటూ వివరించారు. ఈ క్రమంలో జనవరి 4న రాత్రి 9గంటల ప్రాంతంలో స్థానిక వ్యక్తి సంస్థకు చెందిన వ్యర్థాల ట్యాంకర్ను పట్టుకున్నారు. 2016లో కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్(సీఎఫ్వో)కి అనుమతి తీసుకున్న పరిశ్రమ నిర్వాహకులు, 2021 తర్వాత రెన్యువల్ చేసుకోలేదని, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ప్లాంట్కి తరలించకుండా వ్యర్థాలను ట్యాంకర్లతో పారబోస్తున్నారని గుర్తించి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
* ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో పాటు హానికర వ్యర్థాలను వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బి.ఎన్.రెడ్డినగర్లోని తుల్జభవాని ఇండస్ట్రీస్ను మూసివేయాలని పీసీబీ ఆదేశించింది. డ్రైనేజీ కనెక్టివిటీ లేని చోట, సాల్వెంట్లు, ఇతర వ్యర్థాలను రోడ్లపైకి వదిలేస్తున్నారని గుర్తించారు. ఈ పరిశ్రమ ఆరెంజ్ కేటగిరీలోకి వస్తుందని, నిబంధనల ప్రకారం ఇటువంటివి ఓఆర్ఆర్ లోపల ఉండకూదని చెబుతూ మూసివేయాలని ఆదేశాలిచ్చింది.
* మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాలోని నారిన్ ఇండస్ట్రీస్ హానికర రసాయనాలను కలిపే, స్టోరేజ్ యూనిట్కి సైతం కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ (సీఎఫ్వో), కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఇ) లేదని, పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగేలా వాసనలు వస్తున్నాయని గుర్తించారు. హానికర ప్రదేశంలో పనిచేస్తున్నామన్న సంగతి అక్కడి సిబ్బందికి అవగాహన లేదని, ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమ ఓఆర్ఆర్ లోపలు ఉండకూడదంటూ మూసివేతకు ఆదేశాలిచ్చింది.
బయట తాళాలు...లోపల నిషేధిత ఉత్పత్తులు..
పలు ఫార్మా, బల్క్డ్రగ్ కంపెనీల్లో వ్యర్థాలను శుద్ధి చేయకుండా కంపెనీల ఆవరణలో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలకు వరదతో పాటే ఈ వ్యర్థాలూ సమీప చెరువులు, కుంటల్లోకి చేరి అవి కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు ట్యాంకర్లలో వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. నగరంలో పదికి పైగా పారిశ్రామికవాడల్లో 3వేలకు పైగా బల్క్డ్రగ్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్, తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటెదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లో అనుమతులు లేకుండా నిర్వహించే పరిశ్రమలెన్నో ఉన్నాయి. కొందరు మూసివేసిన పరిశ్రమలను ఎంచుకుని ముందు ద్వారాలకు తాళాలు వేసి లోపల నిషేధిత ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
[ 18-04-2024]
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
[ 18-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM