Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్రావు
వైద్యరంగంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఎల్లారెడ్డి: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఆ శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం గండిమాసానిపేట్లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వాళ్ల విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘కేసీఆర్ హయాంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష సాయం అందుతోంది. అదే గుజరాత్ రాష్ట్రంలో రూ.12వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రెండేళ్లకు వస్తదట. ఇలాంటి పథకం పక్కన ఉన్న మహారాష్ట్రలో ఉందా? కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉందా? దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు.. ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్గా తయారయ్యాయి. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్లు జూటా మాటలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, భాజపా నేతలు రాష్ట్ర గౌరవాన్ని కించపర్చే విధంగా మాట్లాడుతున్నారు’’ అని హరీశ్రావు మండిపడ్డారు.
తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది
‘‘మన రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అనేది ఇప్పుడు దేశంలో నానుడి. మహారాష్ట్రలోని రైతులంతా కలిసి తెలంగాణలో ఉన్న పథకాలు మాకు కావాలని పోరాటం చేస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసింది. ఇది మనకు గౌరవం కాదా? తెలంగాణలో ఉన్నట్టు మాకు రైతుబంధు, రైతు బీమా, 24గంటల కరెంట్, చెరువుల అభివృద్ధి, పండిన పంట కొనాలె అని అడుగుతున్నారు. మన రాష్ట్ర పథకాలు బాగున్నాయి కనుకనే దేశం మొత్తం మనవైపు చూస్తోంది. దీన్ని ప్రజలంతా గమనించాల్సి అవసరం ఎంతైనా ఉంది.
కాంగ్రెస్ పాలన మైగ్రేషన్.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్
ఇక్కడికి వచ్చిన మహారాష్ట్ర రైతులను నేనే స్వయంగా అడిగా.. సాగుకోసం ఈరోజుకీ వాళ్లు ఆయిల్ ఇంజిన్లు వాడుతున్నారని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలో కరెంట్ తీగలు లేక ఆయిల్ ఇంజిన్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటదా? తెలంగాణలో టార్చ్లైట్ పెట్టి వెతికిన ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లు కనిపిస్తాయా? వాళ్లేమో (భాజపా నేతలను ఉద్దేశించి) డబుల్ ఇంజిన్ అని అంటారు. అసలు డబుల్ ఇంజిన్లు కాదు.. వాళ్లు పాలించే రాష్ట్రంలో ఇంకా ఆయిల్ ఇంజిన్లే ఉన్నాయి. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తే చిత్రం.. చమత్కారమే అన్నారు. మరి ఇప్పుడు 24 గంటలు వచ్చిందా లేదా? కేసీఆర్ ఏమన్నా మంత్రం వేశారా? ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? దీనివెనక కేసీఆర్ కృషి, పట్టుదల ఉంది. ఆనాటి కాంగ్రెస్ పాలనలో అందరూ వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్. వలసలు వెళ్లినవాళ్లు ఇప్పుడు వాపస్ వస్తున్నారు. బ్రహ్మండంగా వాళ్లకున్న ఎకరం పొలంలో రెండు పంటలు తీస్తున్నారు’’ అని హరీశ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య