అభివృద్ధి, క్రీడలను అవమానించేలా కిషన్రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, క్రీడల విషయంలో రాష్ట్రాన్ని అవమానించేలా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం కప్-2023 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
టోర్నమెంట్లో భాగంగా టాస్ వేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
నారాయణగూడ, న్యూస్టుడే: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, క్రీడల విషయంలో రాష్ట్రాన్ని అవమానించేలా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సీఎం కప్(తెలంగాణ క్రీడా సంబురాలు) పోటీలను ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్స్) ఛైర్మన్ డా.ఆంజనేయగౌడ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శనివారం పరేడ్ గ్రౌండ్లో కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రాష్ట్రానికి పేరు తెచ్చేలా, దేశానికి ఆదర్శంగా ఉండేలా ఉంటాయన్నారు. దేశానికి క్రీడాకారులు కరవయ్యారని, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కామన్వెల్త్, ఒలింపిక్లలో పతకాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా 60 స్టేడియాలు, 16 వేల క్రీడాప్రాంగణాలు నిర్మించుకున్నామన్నారు. కామన్వెల్త్ దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇదివరకు రూ.20, రూ.30 లక్షల నగదు బహుమతి అందజేసేవారని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 కోట్ల వరకు ఇస్తున్నారని వివరించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా క్రీడాకారులకు ఇలాంటి ప్రోత్సాహం ఉందా అని అడిగారు. కార్యక్రమంలో శాట్స్ ఓఎస్డీ డా.లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవి, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
10 వేల మంది క్రీడాకారులు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు గ్రామ, జిల్లా స్థాయిలో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలైన జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయి. ఒక్కో జిల్లా నుంచి 18 ఈవెంట్లు, 18 జట్లు ఇక్కడ పాల్గొంటున్నాయని శాట్స్ ఛైర్మన్ డా.ఆంజనేయగౌడ్ తెలిపారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 29న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM