Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
గచ్చిబౌలిలో ఉండే శంతన్.. సికింద్రాబాద్కని బయలుదేరారు.. కారును రాయదుర్గంలో పార్క్ చేసి మెట్రోలో వెళ్లాలనేది ఆలోచన. కారు పార్కింగ్కు అక్కడ స్థలం లేదు. చేసేది లేక హైటెక్సిటీ మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ మెట్రో మాల్లో పార్క్ చేసి వెళ్లారు.
15 ఎకరాలు కేటాయించినా ఐటీ టవర్ నిర్మాణంతో సరిపెట్టిన సంస్థ
ఈనాడు, హైదరాబాద్
రాయదుర్గంలో మెట్రోకు కేటాయించిన స్థలంలో వెలిసిన వాణిజ్య కార్యాలయం
గచ్చిబౌలిలో ఉండే శంతన్.. సికింద్రాబాద్కని బయలుదేరారు.. కారును రాయదుర్గంలో పార్క్ చేసి మెట్రోలో వెళ్లాలనేది ఆలోచన. కారు పార్కింగ్కు అక్కడ స్థలం లేదు. చేసేది లేక హైటెక్సిటీ మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ మెట్రో మాల్లో పార్క్ చేసి వెళ్లారు. రద్దీవేళ రాయదుర్గం నుంచి హైటెక్సిటీ మెట్రో స్టేషన్కు చేరుకునే సరికి అరగంట పట్టింది. రాయదుర్గంలోనే పార్కింగ్ ఉంటే అరగంట వ్యవధిలో మెట్రోలో బేగంపేట దాటి ఉండేవారు. సరైన పార్కింగ్ సదుపాయం లేక చాలామంది పడుతున్న ఇబ్బందులివి.
ప్రభుత్వం మెట్రోకు రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద లీజుకు కేటాయించింది. వాణిజ్య, కార్యాలయాలు, ఇతరత్రా అభివృద్ధి చేసి లీజుకు, అద్దెకు ఇవ్వడం ద్వారా 50 శాతం టిక్కెటేతర ఆదాయం సమకూర్చుకునేందుకు ఈ భూమి ఇచ్చింది. ఇక్కడ ఏం అభివృద్ధి చేసినా సెల్లార్, కింది అంతస్తుల్లో మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ సదుపాయం కల్పించాలనేది ఒప్పందం. అయితే ఆ స్థలంలో కొంతభాగంలో భారీ ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. పార్కింగ్ సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం మెట్రోస్టేషన్ అందుబాటులోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. ఇప్పటికీ ఆ ఊసే లేదు. మెట్రో బ్లూలైన్ మార్గం తొలుత శిల్పారామం వరకే. అక్కడ చెరువు ఉండటంతో స్టేషన్ నిర్మాణానికి భూమి పటిష్ఠంగా ఉండదని రాయదుర్గం వరకు పొడిగించారు. చివరి స్టేషన్ కావడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి చోట మెట్రోకు భూమి కేటాయించినా పార్కింగ్ సదుపాయం మాత్రం కల్పించడం లేదు.
పలు ప్రాంతాల్లో..
మియాపూర్, నాగోల్లో డిపోల కోసం 200 ఎకరాలకుపైగా కేటాయించింది. ఇందులో 30 శాతం టీవోడీ అభివృద్ధికి అవకాశం కల్పించారు. పలుచోట్ల 2-15 ఎకరాలు కేటాయించారు. అక్కడ పార్కింగ్ కల్పించాలని ఒప్పందం. డిపోలు, మాల్స్ ఉన్న నాగోల్, మియాపూర్, మలక్పేట, ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్సిటీ, రసూల్పురా, మియాపూర్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ప్రారంభ స్టేషన్లు మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్, మియాపూర్ వద్ద ఎల్ అండ్ టీకి కేటాయించిన స్థలంలో వాహనాలు పార్క్ చేసి నిత్యం వేలమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు