logo

ద్విచక్ర వాహనాన్నిఢీకొట్టిన లారీ.. ఇద్దరి దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 29 May 2023 03:45 IST

రామ నర్సింహారావు, చిరంజీవి

దమ్మపేట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన బీమవరపు రామనర్సింహారావు(44), మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మల్లేబోయినపల్లికి చెందిన శ్రీశైల చిరంజీవి(22) కోరమండల్‌ ఎరువుల కంపెనీలో పనిచేస్తున్నారు. రామనర్సింహారావు కొత్తగూడెం, చిరంజీవి సత్తుపల్లి శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరువురు శనివారం సాయంత్రం సత్తుపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వార్షికోత్సవానికి కంపెనీ తరఫున హాజరయ్యేందుకు వెళ్లారు. వేడుకల ముగింపు అనంతరం తెల్లవారుజామున తిరిగి సత్తుపల్లికి వస్తుండగా, మందలపల్లి సమీపంలో అతి వేగంగా వస్తున్న ఓ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలఛిద్రమై చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన రామనర్సింహారావును స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఎస్సై రవికుమార్‌ సందర్శించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. చిరంజీవి బాబాయి వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని