Hyderabad: జూబ్లీహిల్స్లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
జూబ్లీహిల్స్లోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్ రూ.1.2 కోట్లతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్:36లోని ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరు వాసి బానోతు సాయికుమార్ మాదాపూర్లో ఉంటూ మూడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: జూబ్లీహిల్స్లోని ఓ నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్ రూ.1.2 కోట్లతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరు వాసి బానోతు సాయికుమార్ మాదాపూర్లో ఉంటూ మూడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రావు ఈనెల 24న ఉదయం 8.30 గంటలకు రూ.1.2 కోట్లను జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించారు. సాయికుమార్ కార్యాలయ వాహనం ఇన్నోవా (టీఎస్08హెచ్పీ9788)లో డబ్బుతో బయలుదేరి కొద్దిదూరం వెళ్లి కారు వదిలేసి నగదుతో పరారయ్యాడు. డబ్బు ఇంట్లో ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్రావు డ్రైవర్కు ఫోన్ చేయగా కలవలేదు. దీంతో ఏజీఎం షేక్ జిలానీ అదేరోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆదివారం రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా