పేదోడికి గూడు.. ఇంకెప్పుడు?
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పూర్తయిన దాదాపు 65 వేలకు పైగా ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు పంపిణీ చేయమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
సిద్ధంగా 65వేలకు పైగా డబుల్ ఇళ్లు
మంత్రి ఆదేశించినా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయని అధికారులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పూర్తయిన దాదాపు 65 వేలకు పైగా ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు పంపిణీ చేయమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభం సమయంలో ఈ ఫైలు మీదే సంతకం చేశారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్కరికి కూడా వీటిని పంపిణీ చేయలేదు. కనీసం లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేయలేదు. సందట్లో సండేమియా అన్నట్లుగా ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో అనేకచోట్ల తలుపులు, బాత్రూం సామగ్రి పట్టుకుపోవడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు.
మరో రూ.2800 కోట్లు ఇస్తేనే మిగిలినవి
మొత్తం మూడు జిల్లాల పరిధిలో 70 వేల ఇళ్లు పూర్తి కాగా.. 30 వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వీటిని పూర్తి చేయాలంటే ఇంకా రూ.2800 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు నిధుల బకాయిలు ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఈ పనులన్నీ 2016-17 ఎస్ఎస్ఆర్ ప్రకారం చేపట్టారు. ఇప్పుడు ఇసుక, సిమెంట్, స్టీలు రేట్లు విపరీతంగా పెరగడంతో.. ఈ పెరిగిన ధరలను తమకు వర్తింప చేస్తేనే పనులు మొదలుపెడతామని గుత్తేదారులు చెబుతున్నారు. ఈ రేట్లను వర్తింపు చేయాలంటే మరో రూ.600 కోట్లను గుత్తేదారులకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెద్దఎత్తున నిధుల విడుదల సాధ్యమా అన్నది ప్రశ్న? ఈ 30 వేల ఇళ్లలో 90 శాతం పనులు జరిగిన వాటిలో మిగిలిన పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని ఇక్కడకు వచ్చిన తరువాతే రెండు పడక గదుల ఇళ్ల పంపిణీపై పూర్తిస్థాయిలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అసాంఘిక శక్తులకు అడ్డాలుగా..
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మహానగరం పరిధిలో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే లక్షలాదిమంది వీటి కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను కొంతమేర క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన కూడా చేశారు. ఇందులో అర్హులను గుర్తించాల్సి ఉంది. వీరిలో తుది లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా జరగడానికి కనీసం రెండు నెలలు పడుతుందని అంటున్నారు. ఈ బాధ్యతను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. పూర్తయిన ఇళ్లు నెలల తరబడి ఖాళీగా వదిలేయడంతో అనేకచోట్ల ఇళ్ల తలుపులను, ప్లంబింగ్ సామాన్లు కొంతమంది ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. కొన్ని ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.
నగరంలో మొత్తం పూర్తయిన ఇళ్లు 70 వేలు
ఇప్పటివరకు పంపిణీ చేసినవి 4100
పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 65900
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు