శివారులో యువకుడి శవం
శివారులో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిధిలోని పెద్దఅంబర్పేట్- నాగోల్ వెళ్లేదారిలో కుంట్లూర్ గ్రామం రోడ్డు పక్కనే ఉన్న డాక్టర్స్ కాలనీలో సోమవారం స్థానికులు కొందరు మార్నింగ్ వాక్ చేస్తుండగా విపరీతమైన దుర్వాసన రావడాన్ని గమనించారు.
కుళ్లినస్థితిలో మృతదేహం..
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
వివాహేతర సంబంధమే కారణమా?
రాజేష్
హయత్నగర్, న్యూస్టుడే: శివారులో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిధిలోని పెద్దఅంబర్పేట్- నాగోల్ వెళ్లేదారిలో కుంట్లూర్ గ్రామం రోడ్డు పక్కనే ఉన్న డాక్టర్స్ కాలనీలో సోమవారం స్థానికులు కొందరు మార్నింగ్ వాక్ చేస్తుండగా విపరీతమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. నిర్మానుష్య ప్రాంతంలో నిర్మించిన ఓ ప్రహరీ పైనుంచి చూడగా కుళ్లిన స్థితిలో మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలంలో లభించిన సెల్ఫోన్ ఆధారంగా మృతుడు ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్గా గుర్తించారు.
కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి..
హయత్నగర్ పోలీసులు, సంబంధీకుల వివరాల ప్రకారం.. పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావుల పరుశురాములు, విజయ దంపతుల పెద్ద కుమారుడు రాజేష్ (25) ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేశాడు. అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. రాజేష్ బాల్య స్నేహితుడు ములుగు జిల్లా గోపాల్రావుపేట్ మండలం పసుర గ్రామానికి చెందిన సాయి ప్రకాశ్ చైతన్యపురి సాయినగర్ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఈనెల 20న ఉదయం హైదరాబాద్కు వచ్చిన రాజేశ్ స్నేహితుడితోపాటే ఉన్నాడు. 22న మధ్యాహ్నం శ్రీఇందూ కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి బయటకువచ్చాడు. మరునాడు సాయి ప్రకాశ్కు ఫోన్చేసి స్వగ్రామం వెళ్తానని ఛార్జీలకు డబ్బులు కావాలని కోరడంతో రూ.300 పంపించాడు. అదే రోజు రాజేష్ హిమాయత్నగర్లో ఉంటున్న సమీప బంధువు వద్దకు వెళ్లి కలిశాడు. 24న మరో స్నేహితుడికి కాల్చేసి డబ్బులు కావాలని అడిగాడు.అనంతరం 25, 26 తేదీల్లో పలుమార్లు స్నేహితులు కాల్ చేసినా రాజేష్ ఫోన్ ఎత్తలేదు. 27న మళ్లీ కాల్చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈనెల 26నే రాజేశ్ మృతి చెందినట్లు భావిస్తున్నారు. చేతికంది వచ్చిన కన్నకొడుకు మృతదేహాన్ని చూసిన రాజేశ్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
విలపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు
ఫోన్ కాల్స్ ఆధారంగా..: సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహం పక్కన సెల్ఫోన్, ఓ కండోమ్ లభించినట్లు సమాచారం. ఫోన్లోని కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి గది నుంచి బయటకు వచ్చాక అతను ఎక్కడెక్కడ తిరిగిందీ ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో....
హయత్నగర్కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేష్కు కొంతకాలంగా ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి బంధం గురించి భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేష్తో జరిపిన వాట్సప్ చాటింగ్లో చెప్పడంతో అలా చెయొద్దని తానూ చనిపోతానని రాజేశ్ చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమె ఈనెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మృతి చెందింది. కాగా ఈనెల 24 నుంచీ రాజేశ్ సదరు మహిళ ఇంటి చుట్టూ తిరుగుతుండగా.. ఆమె కుమారుడు గమనిం చాడు. తన స్నేహితులతో కలిసి ఈనెల 26న రాజేశ్ను పట్టుకొని నిలదీసి, అతని సెల్ఫోన్ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు రాజేశ్ను కొట్టి హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం. ఆ తర్వాత మనస్తాపంతో రాజేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం