టీ-24, టీ-6తో ఆర్టీసీకి పెరిగిన రద్దీ
ప్రయివేటు వాహనాల్లో గమ్యస్థానాలను చేరుకునే ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీ-24, టీ-6 పాస్ స్కీమ్లు సత్ఫలితాలనిస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్: ప్రయివేటు వాహనాల్లో గమ్యస్థానాలను చేరుకునే ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీ-24, టీ-6 పాస్ స్కీమ్లు సత్ఫలితాలనిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నాలుగైదు గమ్యస్థానాలను చేరుకునే వెసులుబాటు ఉండటంతో డే-పాస్లు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి నుంచి గమనిస్తే మే 28 నాటికి సగటున 40 నుంచి 55శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి 31 నాటికి సగటున రోజుకు 1,994 మంది ప్రయాణించగా మే 28 నాటికి ఆ సంఖ్య 4,533కి పెరిగింది.
* వేసవిలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం రూ.100 ఉండే టీ-24 టికెట్పై 10శాతం రాయితీని కల్పించి రూ.90 చేసింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడినవారికి) రూ.80కే అందిస్తుండగా..సగటున రోజుకు 32,218 మంది ప్రయాణిస్తున్నారు. మార్చిలో ప్రయాణించిన వారితో పోల్చితే ఈ సంఖ్య 50శాతం పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఎఫ్-24తో పెరుగుతున్న ఆదరణ
ఎఫ్(ఫ్యామిలీ)-24 టికెట్కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. రూ.300 చెల్లించి కుటుంబ సభ్యులు, బంధువులు (నలుగురు) కలిసి రోజంతా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24గంటల పాటు ప్రయాణించొచ్చు. మార్చి నెలలో గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మొత్తం 2,386 మంది ఈ టికెట్ కొనుగోలు చేయగా మే నెలలో 5,860 మంది ప్రయాణించారు. ఈ లెక్కన మార్చి నెలలో సగటున రోజుకు 298 ఉండగా, మే నెలాఖరుకు 651కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!