logo

Hyderabad: స్నేహితుడి భార్యతో వ్యాపారి అదృశ్యం

శిర్డీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యను తీసుకెళ్లాడు. మారేడుపల్లి ఎస్సై మోహన్‌ వివరాల ప్రకారం..

Updated : 02 Jun 2023 08:19 IST

కంటోన్మెంట్‌: శిర్డీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యను తీసుకెళ్లాడు. మారేడుపల్లి ఎస్సై మోహన్‌ వివరాల ప్రకారం.. న్యూబోయిన్‌పల్లి వ్యాపారి అతుల్‌ (45) మే 29న శిర్డీ వెళ్లాడు. మరుసటిరోజు నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అయితే అతుల్‌ తన భార్యకు రాసిన లేఖ ఇంట్లో దొరికింది. అందులో తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తున్నానని, ఈ విషయం తన స్నేహితుడికి తెలుసునని, తమను వెతకవద్దని లేఖలో ఉందని, రూ.10 లక్షల నగదు తీసుకెళ్లాడని అతుల్‌ భార్య ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని