YS Sharmila: తెలంగాణలో మళ్లీ మరో ఉద్యమం జరగాలి: షర్మిల

నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Updated : 02 Jun 2023 14:27 IST

హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భంగా ఆమె ట్వీట్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని విమర్శించారు. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి గెలిచి, నిలిచింది వైతెపా అన్నారు.  నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించామన్నారు. 

‘‘నిధులు పక్కదారి పట్టి తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా వైతెపా నిలిచింది. వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి వాగ్ధానాలపై గొంతెత్తింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మరో ఉద్యమం జరగాలి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. వైఎస్సార్‌ సంక్షేమ పాలన రావాలి.  ప్రజలు అభివృద్ధి బాట పట్టాలి. సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలి’’ అని షర్మిల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని