logo

Hyderabad: ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం

Published : 04 Jun 2023 21:17 IST

హైదరాబాద్‌: తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమాన ప్రయాణికులు ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  45 నిమిషాల పాటు రన్‌వేపైనే విమానం నిలిపివేసిన అధికారులు, ప్రయాణికులు కిందకు దిగనీయకుండా ఆపారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సు అందుబాటులో లేదని విమానం డోర్‌ కూడా తెరవలేదు. దీంతో గంటపాటు ఇబ్బంది పడ్డామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని