logo

Hyderabad: పక్కింటి వారు తిట్టినా భర్త పట్టించుకోలేదని బలవన్మరణం

పిల్లలు గొడవ పడిన విషయంలో పక్కింటివారు తిట్టారని చెప్పినా భర్త పట్టించుకోలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది.

Updated : 07 Jun 2023 09:21 IST

పటాన్‌చెరు అర్బన్‌: పిల్లలు గొడవ పడిన విషయంలో పక్కింటివారు తిట్టారని చెప్పినా భర్త పట్టించుకోలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై దుర్గయ్య వివరాల ప్రకారం.. రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన శిరీష(25).. నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడున్నరేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం శిరీష కూతురు పల్లవి.. పక్కింటి పిల్లలు గొడవపడ్డారు. పక్కింటివారు శిరీషను తిట్టారు. ఈ విషయం భర్త గణేష్‌కు ఫోన్‌ చేసి తెలిపింది. రాత్రి భర్త ఇంటికి వచ్చి రాగానే పక్కింటివారిని అడగవా? అంటూ శిరీష భర్త గణేష్‌తో గొడవపడింది. ఎవరు తిట్టినా పట్టించుకోవంటూ ఈనెల 5న రాత్రి శిరీష ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందింది. తన కూతురు శిరీష మృతిపై అనుమానం ఉందని ఆమె తల్లి లక్ష్మి పటాన్‌చెరు ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని