logo

హైదరాబాద్‌లో రెండు రోజులు చేపమందు పంపిణీ

మృగశిర కార్తె వేళ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేపమందు పంపిణీ చేయనున్నారు.

Published : 07 Jun 2023 18:32 IST

హైదరాబాద్: మృగశిర కార్తె వేళ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేపమందు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, దిల్లీ సహా దేశం నలుమూలల నుంచి ఇప్పటికే  ప్రజలు భారీగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి చేరుకుని చేపమందు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని