దొంగ బంగారం దర్జాగా వ్యాపారం!
ధర పెరిగినా.. తగ్గినా వన్నె తరగని గొప్పతనం పసిడి సొంతం. ఇందు కోసమే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని పలు ముఠాలు చైన్ స్నాచింగ్లకు తెగబడుతున్నాయి. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా రూ.100 కోట్ల విలువైన సొత్తు మాయమవుతోంది.
కేరళ, తమిళనాడు నుంచి భారీగా నగరానికి చేరవేత
ధర పెరిగినా.. తగ్గినా వన్నె తరగని గొప్పతనం పసిడి సొంతం. ఇందు కోసమే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని పలు ముఠాలు చైన్ స్నాచింగ్లకు తెగబడుతున్నాయి. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా రూ.100 కోట్ల విలువైన సొత్తు మాయమవుతోంది. దీనిలో 80 శాతం ఆభరణాలే ఉంటాయి. ఇంతటి డిమాండ్ ఉన్న బంగారం నగరంలోకి భారీగా స్మగ్లింగ్ అవుతోంది. అడ్డదారిలో రోజూ ఇక్కడ 200 కిలోల దొంగ బంగారం చేతులు మారుతుంటుందని అంచనా. దీనిలో ఎక్కువ భాగం కేరళ, తమిళనాడు నుంచి వస్తోంది. ఎక్కడా లెక్కలు చూపని సొత్తు కావడంతో దుకాణాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది నేరస్థులతో కలిసి మాయం చేస్తున్నారు. బయటపడితే లోగుట్టు తెలుస్తుందనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేసేందుకూ ముందుకు రావడం లేదని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.
పాత పుత్తడికి డిమాండ్..
దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన పుత్తడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దొంగలు, స్మగ్లర్ల చేతికి వచ్చిన పసిడి, వెండి ఆభరణాలు రిసీవర్ల చేతికి చేరతాయి. అక్రమ సరకు కావటంతో రూ.లక్ష విలువైన ఆభరణాలకు రూ.30,000-40,000 లోపు ధర చెల్లించి దళారులు దక్కించుకుంటారు. పోలీసులకు చిక్కినా ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు ఆభరణాలను కరిగిస్తారు. నాణేలు, బిస్కెట్లుగా మార్చి విక్రయిస్తారు. నగరంలో సికింద్రాబాద్, అబిడ్స్, దిల్సుఖ్నగర్, చార్మినార్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో కార్ఖానాలున్నాయి. పశ్చిమబెంగాల్, యూపీ, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. చిన్నగదిలో సుమారు 10-12 మంది ఎల్పీజీ గ్యాస్ సహాయంతో బంగారాన్ని కరిగిస్తుంటారు. వీరిపై అజమాయిషీ చేసేందుకు ఓ వ్యక్తి ఉంటాడు. ప్రమాదమనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు దుకాణాల బయటే పెడతారని, లోపల ఉండవని సికింద్రాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి తెలిపారు. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలంటూ దుకాణాల నిర్వాహకులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడేం జరుగుతుందంటే
నిర్దేశించిన బులియన్ మార్కెట్ ట్రేడర్స్ వద్దనే బంగారం కొనుగోలు చేయాలి. ఇక్కడ జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారా ఉంటాయి. బిల్లులు, పన్నులతో సంబంధం లేకుండా పసిడిని కరిగించి ముద్దలు, నాణేలు, బిస్కెట్లుగా తయారు చేసి 99.80 శాతం నాణ్యత ఉండే బంగారాన్ని పలు దుకాణాలు కొనుగోలు చేస్తాయి. వాటినే ఆభరణాలుగా తయారు చేస్తుంటారు. వీరే 916హాల్మార్కును ముద్రిస్తారు. గతంలో చార్మినార్, బేగంబజార్లో ఉండే ఈ తరహా వ్యాపారులు ఏడాది కాలంగా సికింద్రాబాద్ను అడ్డాగా చేసుకున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే బంగారం వీరి ద్వారానే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చేతులు మారుతుంటుందని పాట్మార్కెట్కు చెందిన ఓ వ్యాపారి వివరించారు. ఇలాంటి వారి వల్ల తాము కూడా నష్టపోతున్నామంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి వారికి కొందరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. బంగారం పట్టుబడినా, చోరీ జరిగినా కేసు నమోదు కాకుండా సొత్తును రికవరీ చేయించుకుంటున్నారు. ఇవే ఆరోపణలతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు ఉన్నతాధికారులు ఛార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది.
ఇటీవల దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పసిడి ఆభరణాలు
ఈనాడు, హైదరాబాద్, రెజిమెంటల్బజార్, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్