Hyderabad: ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు

నగరంలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌ నగర్‌కు చెందిన నవ్య.. బుధవారం రాత్రి ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది.

Updated : 08 Jun 2023 12:42 IST

హైదరాబాద్‌: నగరంలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవ్య అనే విద్యార్థిని బుధవారం రాత్రి ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై నవ్య తల్లిదండ్రుల ఆరోపణలు వేరేలా ఉన్నాయి. తమ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళ్తున్నారని.. అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నవ్య తల్లిదండ్రులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని