DK Aruna: అదంతా దుష్ప్రచారం.. పార్టీ మారే అవసరం లేదు: డీకే అరుణ
పార్టీ మారే అవసరం తనకు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.
హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. అదంతా దుష్ర్పచారమని ఖండించారు. తనకు పార్టీ మారే అవసరం లేదని పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చిన భాజపాలోనే కొనసాగుతానని డీకే అరుణ స్పష్టం చేశారు. భాజపాలోనే ఉంటానని పార్టీని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.