DK Aruna: అదంతా దుష్ప్రచారం.. పార్టీ మారే అవసరం లేదు: డీకే అరుణ

పార్టీ మారే అవసరం తనకు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.

Updated : 08 Jun 2023 21:50 IST

హైదరాబాద్‌: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. అదంతా దుష్ర్పచారమని ఖండించారు. తనకు పార్టీ మారే అవసరం లేదని పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చిన భాజపాలోనే కొనసాగుతానని డీకే అరుణ స్పష్టం చేశారు. భాజపాలోనే ఉంటానని పార్టీని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానన్నారు. ఇలాంటివి  పునరావృతం అయితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని