భూసేకరణ చేయలేక.. చెట్ల నరికివేత
రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు భూసేకరణ చేపట్టలేకపోయారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రహదారి పక్కనున్న ఏళ్ల నాటి చెట్లను వేర్లతో సహా పెకలించారు.
హైటెక్సిటీ రైల్వేస్టేషన్-సైబర్టవర్స్ రోడ్డుపై నిర్వాకం
కాలిబాటపై రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక
పోలీసుల ఒత్తిడే కారణమంటోన్న జీహెచ్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు భూసేకరణ చేపట్టలేకపోయారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రహదారి పక్కనున్న ఏళ్ల నాటి చెట్లను వేర్లతో సహా పెకలించారు. పచ్చదనానికి సమాధి కట్టారు. ఇప్పుడు ఆ కాలిబాటను రోడ్డుగా మార్చబోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైటెక్సిటీ రైల్వేస్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వరకు ఉన్న రోడ్డులో చోటుచేసుకున్న దారుణమిది. పెరిగిన ట్రాఫిక్ సమస్యకు రోడ్డు విస్తరణే పరిష్కారమైనా.. చట్టబద్ధమైన విధానాన్ని పాటించలేదు. సైబరాబాద్ కమిషనరేట్లోని ఓ పోలీస్ ఉన్నతాధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కలిసి కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచి, చెట్ల నరికివేత చేపట్టారని జీహెచ్ఎంసీ వాపోయింది.
హైటెక్సిటీలో ‘అధికార’ యుద్ధం..
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) కింద హైటెక్సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పెద్దఎత్తున రోడ్లను అభివృద్ధి చేసింది. సుమారు రూ.700 కోట్ల పనులను పూర్తి చేయగా మరిన్ని పురోగతిలో ఉన్నాయి. అయినప్పటికీ ట్రాఫిక్ సమస్య యథాతథం. ముఖ్యంగా 6 ప్రాజెక్టులు పూర్తయిన జేఎన్టీయూ-బయోడైవర్సిటీ కూడలి కారిడార్లో తలెత్తుతోన్న సమస్యను చర్చించుకోవాలి. ఈ మార్గంలో పలు కూడళ్లున్నాయి. వాటి దగ్గర వాహనాలు నిలవకుండా సాగిపోవాలన్నది ఎస్సార్డీపీ లక్ష్యం. బయోడైవర్సిటీ కూడలిపై 2 పైవంతెనలు, మైండ్స్పేస్ కూడలిపై పైవంతెన, అండర్పాస్, అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్పాస్, హైటెక్సిటీ రైల్వేస్టేషన్ వద్ద ఆర్యూబీ, ఆర్ఓబీ, జేఎన్టీయూ నుంచి మలేషియన్ టౌన్షిప్ వరకు పొడవైన పైవంతెనలు నిర్మాణమయ్యాయి. కొన్నేళ్ల కిందట సైబర్ టవర్స్ కూడలిపై నిర్మించిన పైవంతెన గురించి అందరికీ తెలిసిందే. ఇక ట్రాఫిక్ సమస్య పేరుతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు అడుగుతున్నారని, అడ్డదిడ్డంగా విభాగినులపై ఉండే చెట్లను నరికించేస్తున్నారని, పైవంతెనల కింద సరైన ఎత్తు లేనిచోట కూడా యూటర్న్లు పెడుతున్నారని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండా ఎన్ఐఏ భవనం మూల మలుపులో స్పీడు బ్రేకర్లు వేయాలంటూ తాజాగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.
ఆ రెండు ఆస్తులు సేకరించలేక..
అయ్యప్ప సొసైటీ కూడలి నుంచి హైటెక్సిటీ రైల్వేస్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్డు నిర్మించాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యం. అందుకు ఇద్దరు యజమానులు అడ్డుపడ్డారు. వారిలో ఒకరు ఐఆర్ఎస్ అధికారి కావడంతో జీహెచ్ఎంసీ భూసేకరణకు సాహసించలేదనే విమర్శలున్నాయి. ఎలాగైనా రోడ్డు విస్తరించాలనే పోలీసుల ఒత్తిడితో బల్దియా పార్కుల విభాగం సర్కిల్ మేనేజరు నరసయ్య నెలక్రితం రాత్రికి రాత్రి కాలిబాట పొడవునా ఉన్న 73 చెట్లను నరికించారని, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు ప్రచారం కావడంతో అటవీశాఖ.. ఆయన్ను సస్పెండ్ చేసింది. బాధ్యులైన పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను అటవీశాఖ చర్యల నుంచి తప్పించిందని, కిందిస్థాయి అధికారిని బదిలీ చేసి చేతులు దులిపేసుకుందనే విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
[ 20-04-2024]
హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హారీశ్రావు విమర్శించారు. -
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
[ 20-04-2024]
బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. -
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
[ 20-04-2024]
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. -
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్రెడ్డి
[ 20-04-2024]
భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
[ 20-04-2024]
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?