Hyderabad: ‘రూ.300 చెల్లించండి.. 200 గజాల భూమి పొందండి’
కేవలం రూ.300 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 200 గజాల భూమి, రూ.లక్ష లోన్ ఇస్తామం’టూ రవీంద్రభారతి పక్కనే ఉన్న మౌంట్ నసీర్ అపార్ట్మెంట్లోని ‘జై మహాభారత్ పార్టీ’ అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్ శ్రీఅనంత విష్ణు తమను నమ్మించారంటూ వందల సంఖ్యలో వచ్చిన మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు.
అనంత విష్ణు లీలలు
జై మహాభారత్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ప్రజల మధ్య భగవాన్ అనంత విష్ణు
నారాయణగూడ, న్యూస్టుడే: కేవలం రూ.300 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 200 గజాల భూమి, రూ.లక్ష లోన్ ఇస్తామం’టూ రవీంద్రభారతి పక్కనే ఉన్న మౌంట్ నసీర్ అపార్ట్మెంట్లోని ‘జై మహాభారత్ పార్టీ’ అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్ శ్రీఅనంత విష్ణు తమను నమ్మించారంటూ వందల సంఖ్యలో వచ్చిన మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమి ఇవ్వాలంటూ మహిళలు అనంత విష్ణును నిలదీశారు. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా కొందరు మహిళలు నిలదీయగా.. మరో మహిళ వారించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడున్న మహిళలు ఆమెపై దాడికి దిగారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహిళలు రావడం గమనార్హం. గతంలో సైఫాబాద్ పోలీసులు అనంత విష్ణుపై కేసు నమోదు చేశారు. తాను సుప్రీంకోర్టు న్యాయవాదినని చెప్పేవాడు. ఇప్పటికి లక్షల మంది నుంచి రూ.300 చొప్పున వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అనంత విష్ణును ప్రశ్నించగా తమ ట్రస్టుకు సంబంధించి వేలాది ఎకరాల భూములున్నాయని, పేదలకు పంచిపెడతామంటూ ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించాలనుకున్నామని, డీసీపీ అనుమతించ లేదని, కోర్టుకు వెళతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్ల పెరుగుదలలో కమలానిదే పై చేయి
[ 05-12-2023]
రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉన్నా రాజధాని పరిధిలో దాన్ని సొమ్ము చేసుకుని తమ ఓటు శాతాన్ని పెంచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే హస్తానికి ఈ ఎన్నికల్లో 4.82 శాతం ఓటింగ్ శాతం తగ్గింది. -
నేరాలు పైపైౖకి
[ 05-12-2023]
మహానగరంలో నేరాల రేటు వరుసగా పెరుగుతోంది. ఏటా సగటున రెండు వేల చొప్పున కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) క్రైమ్ ఇన్ ఇండియా- 2022(దేశంలో నేరాలు) నివేదికను తాజాగా విడుదల చేసింది. -
ఈ ఫలితం.. లోక్సభలో పునరావృతమైతే!
[ 05-12-2023]
శాసనసభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్.. భాజపాల అంచనాలకు భిన్నంగా వచ్చాయి. రాజధాని నగరంలో సత్తా చాటుదామని కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఒక్కరూ గెలవలేదు. -
శిక్షణ విహంగాలు.. విషాదగీతికలు
[ 05-12-2023]
శిక్షణ విమానాలు కుప్పకూలుతున్న ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తి క్రాష్ల్యాండింగ్ అవుతున్నాయి. -
ఆర్థిక మోసాల భాగ్యనగరం
[ 05-12-2023]
ఆర్థిక నేరాలు ముంబయి తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఏటా పెరుగుదల రేటు అత్యధికంగా కనిపిస్తోంది. 2022లో ముంబయిలో 6,960, హైదరాబాద్లో 6,015 కేసులు నమోదయ్యాయి. -
మైనార్టీ ఓట్లు ఎటు పడ్డాయంటే..
[ 05-12-2023]
శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్ మొదటి నుంచి మైనార్టీ ఓటు బ్యాంకుపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ, ఫలితాలను గమనిస్తే మైనార్టీలంతా భారాసకే ఓటేశారని స్పష్టమవుతోంది. -
మహిళలపై ఎక్కువైన వేధింపులు
[ 05-12-2023]
మహిళలపై నేరాల్లో హైదరాబాద్ దేశంలోనే నాలుగోస్థానంలో ఉంది. 2022లో మొత్తం 3,145 నేరాలు నమోదయ్యాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం వరుసగా మూడో ఏడాది పెరుగుదల కనిపించింది. -
అధినేత.. అభినందన
[ 05-12-2023]
భారాస తరఫున రాజధాని పరిధి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధి ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. -
రాజాసింగ్ సేవల్ని వినియోగించుకుంటాం
[ 05-12-2023]
గోషామహల్లో మూడోసారి గెలుపొందిన ఎమ్మెల్యే రాజాసింగ్ను ధూల్పేటలోని ఆయన నివాసం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సోమవారం సన్మానించారు. -
వినియోగదారుల పరిరక్షణ చట్టం
[ 05-12-2023]
వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని కొందరు సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. డిస్మిస్ చేసిన కేసులను ఇతర కమిషన్లలో మరోసారి దాఖలు చేసి పరిహారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. -
అనూహ్యంగా తెరపైకి
[ 05-12-2023]
గ్రేటర్లో చివరి నిమిషంలో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న కొందరిని అదృష్టం వరించింది. మరికొందరిని ఓటమి పలకరించింది. గతానికి భిన్నంగా ఈ దఫా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. -
కీలక విభాగాలకు త్వరలో కొత్త బాసులు!
[ 05-12-2023]
తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో గ్రేటర్ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. -
ఎందుకలా.. చేతికిలా?
[ 05-12-2023]
శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా.. రాజధాని పరిధిలో ఆ పార్టీ చతికిలపడింది. అగ్రనేతలందరూ ఇక్కడే ఉన్నా పట్టునిలుపుకోలేక పోయింది. -
భారాసకు పెరిగిన ఓట్లు.. తగ్గిన సీటు
[ 05-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగర పరిధిలో భారాస 36.08 శాతం ఓటు వాటా సాధించింది. 29 నియోజకవర్గాల్లో 18 స్థానాలను కైవసం చేసుకుంది. -
సత్తా చాటిన నారీమణులు ఇద్దరే
[ 05-12-2023]
శాసనసభ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్, భాజపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలబడిన మహిళా అభ్యర్థుల్లో సబితా ఇంద్రారెడ్డి, లాస్య నందితలు మాత్రమే గెలుపొందారు. -
డిజిటల్ ప్రచారం.. విజయతీరం
[ 05-12-2023]
గ్రేటర్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రచారంలో భారాస, భాజపాలు ముందు వరుసలో నిలిచాయి. -
మేడ్చల్ జడ్పీ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం
[ 05-12-2023]
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సోమవారం భారాస జడ్పీటీసీ సభ్యులు మేడ్చల్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గౌతమ్ను కలిసి నోటిసులు అందజేశారు. -
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
[ 05-12-2023]
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో 24 మంది గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం చేవెళ్లలో వెలుగు చూసింది. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
[ 05-12-2023]
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) హైదరాబాద్ కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్నుయిమి అన్నారు. -
ఉస్మానియా ఆసుపత్రి సేవలు భేష్
[ 05-12-2023]
ఉస్మానియా ఆసుపత్రిలో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని అమెరికా వైద్యుల బృందం పేర్కొంది. -
నిలబెట్టిన నమ్మకం.. చేతికి బలం!
[ 05-12-2023]
వికారాబాద్ జిల్లా పూర్తి గ్రామీణ నేపథ్యం. నాలుగు మున్సిపాలిటీలున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తీర్పు మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నియోజక వర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. -
నాడి పసిగట్టి.. పార్టీ మార్చి..
[ 05-12-2023]
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సరిహద్దునున్న తాండూరు నియోజక వర్గంలో హస్తం పార్టీ హవాను గుర్తించిన భారాస నేతలు ఒక్కసారిగా పార్టీని వీడారు. -
వికారాబాద్.. మారింది ఆనవాయితీ!
[ 05-12-2023]
ఒకసారి పరాజితులైనవారు మళ్లీ విజయం సాధించలేరన్న ఆనవాయితీని వికారాబాద్ ఓటర్లు ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాద్కుమార్ గెలుపుతో పదిలంగా ఉన్న ఆ ఆనవాయితీ తిరగబడింది. -
అప్పుడే వస్తారు.. అందలం ఎక్కేస్తారు
[ 05-12-2023]
బషీరాబాద్ మండలం అంటేనే ప్రత్యేకం. జిల్లాకు చిట్ట చివరన ఉన్నప్పటికీ ఈ మండలానికి చెందిన వ్యక్తులే ఎళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈసారి మాత్రం బషీరాబాద్ మండలానికి ఆ అదృష్టం దక్కకుండా పోయింది.