నిమజ్జనం.. శోభాయమానం
తాండూరులో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది.
తాండూరు టౌన్, తాండూరుగ్రామీణ, న్యూస్టుడే: : తాండూరులో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు. పట్టణవాసులతో పాటు, పల్లె ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ శేఖర్గౌడ్ బందోబస్తును పర్యవేక్షించారు. పాత తాండూరు గడీ ప్రాంతంలో ముస్లిం పూలు చల్లి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది. భారీ విగ్రహాలను ట్రాక్టర్ల్లు ఇతర వాహనాల్లో గంగమ్మ ఒడికి తరలించారు. భద్రేశ్వర దేవాలయం వద్ద హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజుగౌడ్, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహులు స్వాగతం పలికారు. వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద, తులసీనగర్లో మట్టి వినాయకులను ఉన్న చోటనే నిమజ్జనం చేశారు. గౌతాపూర్లో మల్లికార్జున వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వినాయక మండపం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రహేళిక పోటీల్లో విజేతలైన యువకులు శ్రీకాంత్, రమేష్గౌడ్, సాయిప్రసాద్, ఖలీల్పాషకు రూ.10,500 నగదు ప్రోత్సాహకాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘాధ్యక్షులు నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు జన్నెనాగప్ప, భారాస కన్వీనర్ శకుంతల, నాయకులు రాంచంద్రారెడ్డి, మహేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి చేతుల మీదుగా అందజేసి అభినందించారు. వినాయక చేతిలో ఐదు రోజులపాటు పూజలందుకున్న గణపతి లడ్డూలను పాండురంగారెడ్డి రూ.80,116కు, మోహన్రావు దేశ్పాండే రూ.75వేలకు, జన్నె లక్ష్మణ్ కలశాన్ని రూ.30వేలకు వేలంపాట ద్వారా పొందారు.
పర్యవేక్షిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న కుంటలో శుక్రవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పాలనాధికారి నారాయణరెడ్డి, అదనపు పాలానాధికారులు రాహుల్శర్మ, లింగ్యానాయక్, జిల్లా అధికారులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూలను రెవెన్యూ సిబ్బంది అరుణ్కుమార్ రూ.2,22,222కు, శ్రీనివాస్ రూ.2.20 లక్షలకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వరసిద్ది వినాయక ఆలయంలో నిమజ్జనం చేస్తున్న కాలనీ వాసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ పెరుగుదల.. స్వల్పమే!
[ 02-12-2023]
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఆసాంతం సజావుగా సాగడం అందరికీ ఉపశమనం కలిగించింది. నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని గమనిస్తే ఈసారి పురుషులు 77.47 శాతం ఓటుహక్కు వినియోగించుకుంటే, మహిళలు 76.51 శాతం మేర మాత్రమే ఓటేయడం గమనార్హం. -
ధీమా పైపైన.. గుబులు లోలోన
[ 02-12-2023]
ఓట్ల లెక్కింపు గడువు దగ్గర పడటంతో బరిలో నిల్చిన ప్రధాన పార్టీల నేతలు తమకు పడ్డ ఓట్ల మీద ఇప్పుడు కూడికలు తీసివేతలతో బిజీగా ఉన్నారు. కార్యకర్తలను ఇళ్లకు పిలిచి ఏ కాలనీలో ఏ విధంగా పోలింగ్ జరిగింది.. అందులో తమకు ఎన్ని ఓట్లు పడతాయి.. -
మహిళాముద్ర
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగంలో మహిళలు స్ఫూర్తిగా నిలిచారు. ఓటు వేయడం విధిగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
విజేత తేలేదిలా..
[ 02-12-2023]
ఎన్నికల పర్వంలో చివరిది.. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. -
పోలింగ్ తగ్గడానికి కారణాలెన్నో
[ 02-12-2023]
ఎన్నికలు జరిగినప్పుడల్లా.. పోలింగ్ శాతాలపై చర్చించుకోవడం.. తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. ఎందుకిలా అనేదానిపై లోతైన పరిశీలన చేసిన దాఖలాలు లేవు. -
ఈవీఎంలలో బలాలు.. బయట బలగాలు
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్రూంలో భద్రంగా ఉంచారు. -
బాతాఖానీ.. ఖాతా ఖాళీ
[ 02-12-2023]
హుమాయున్నగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామంటూ సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నెంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ.1.33 లక్షలు లాగేశారు. -
పెళ్లి వలకు చిక్కొద్దే బాలా!
[ 02-12-2023]
బేగంపేటలోని విశ్రాంత ఉద్యోగికి ఇద్దరు ఆడపిల్లలు. ఓ వెబ్పోర్టల్లో వారి వివరాలు ఇచ్చారు. చిన్న కుమార్తె నచ్చిందంటూ తండ్రికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు వచ్చాడని, వెంటనే పెళ్లి చేసి పంపాలన్నాడు. -
అవగాహనలేమి వల్లే జీవితాలు బలి
[ 02-12-2023]
నారాయణగూడ:అవగాహన లోపం వల్లే కొందరు ‘హెచ్ఐవీ’ (ఎయిడ్స్) బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారని కింగ్కోఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో ప్రపంచ ఎయిడ్స్దినం సందర్భంగా అవగాహన నిర్వహించారు. -
అందాల అవిక ఆభరణాల దీపిక
[ 02-12-2023]
బంజారాహిల్స్ రోడ్డు నం.1లోని లేబుల్స్ ది పాప్-అప్ స్పేస్లో ‘స్వాన్’ ఫ్యాషన్, లైఫ్స్టైల్ వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. యువతార అవికాగోర్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. -
కారు ఢీకొని మహిళ మృతి
[ 02-12-2023]
ఓటు వేసి వెళ్తున్న మహిళను కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్లో జరిగింది. -
మంగళ్హాట్ ఎస్సైఅంబికకు రివార్డు
[ 02-12-2023]
అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా రెండు రాజకీయ పార్టీలకు చెందిన పురుషులు, మహిళలు గొడవపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మంగళ్హాట్ మహిళా ఎస్సై జి.అంబిక ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రశంసిస్తూ నగర పోలీసు కమిషనరు ఆమెకు రివార్డు అందజేశారు. -
బోగస్ ఓట్లకు పథకం.. ముగ్గురి అరెస్టు
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేసేందుకు పథకం రచించిన ముగ్గురిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని తన కార్యాలయంలో డీసీపీ బాలస్వామి, టాస్క్ఫోర్సు డీసీపీ నికితా పంత్ వివరాలు వెల్లడించారు. -
రైల్లో సికింద్రాబాద్ స్టేషన్కు చేరిన చిన్నారులు
[ 02-12-2023]
రైల్లో వచ్చిన ఇద్దరు చిన్నారులకు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆశ్రయం కల్పించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దేవగిరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోగా.. -
ఆపరేషన్ లేకుండా ప్రొస్టేట్ సమస్యకు చెక్
[ 02-12-2023]
వయసు 50 ఏళ్లు దాటిన పురుషులు దాదాపు 25 శాతం మందిలో ప్రొస్టేట్ (వీర్యగ్రంథి) పెరుగుదల సమస్య ఉత్పన్నమవుతుంటుందని.. ప్రస్తుతం దీనికి అధునాతన చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఎండీ, యూరాలజిస్టు డాక్టర్ మల్లికార్జున తెలిపారు. -
హైటెక్స్లో ట్రావెల్ మార్ట్ ప్రదర్శన ప్రారంభం
[ 02-12-2023]
మాదాపూర్లోని హైటెక్స్లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్(ఐఐటీఎం) పేరిట ఏర్పాటు చేసిన పర్యాటక, ట్రావెల్స్ సంస్థల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. -
గొంతులో చీముగడ్డకు శస్త్రచికిత్స
[ 02-12-2023]
తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్న బాలిక ప్రాణాలను ప్రభుత్వ ఈఎన్టీ వైద్యులు కాపాడారు. వైద్యుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చేర్యాల దొమ్మేటకి చెందిన శ్రుతి(15) కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. -
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
[ 02-12-2023]
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గోసంరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. పార్లమెంటులో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టి సత్వరం ఆమోదించాలని ప్రధాని మోదీకి విజ్ఞపి చేశాయి. -
పక్కా ప్రణాళిక.. పటిష్ఠ కార్యాచరణ
[ 02-12-2023]
జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, పార్టీల అభ్యర్థులు గొడవ పడటం వంటి స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. -
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
[ 02-12-2023]
పరిగిలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఏర్పాట్ల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎన్నికల పరిశీలకులు సుధాకర్గార్గె, ఆకాష్ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న పనులను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విజయకుమారిని అడిగి తెలుసుకున్నారు. -
ఎవరి లెక్కలు వారివే..!
[ 02-12-2023]
పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడం, ఫలితాలకు మరో 24 గంటలు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలతో కుస్తీ పడుతున్నారు. -
రాజధానిలో అత్యల్పం
[ 02-12-2023]
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఓటింగ్ శాతంలో రాజధానిలోని హైదరాబాద్ జిల్లాది అట్టడుగు స్థానం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 2018-శాసనసభ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1 శాతం తక్కువగా ఓట్లేయడం విమర్శలకు తావిస్తోంది. -
18 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలకు రాజధాని సిద్ధమైంది. గురువారం పోలింగ్ పూర్తవగా, పోలైన ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. -
ఇంకు చుక్క.. 50 శాతం దాటక
[ 02-12-2023]
ముగిసిన పోలింగ్తో ఊపిరిపీల్చుకున్న నేతలు ఫలితాలు ఎలా ఉంటాయనేది లెక్కలు కడుతున్నారు. పాతబస్తీ పరిధిలో కొన్నిచోట్ల గతం కన్నా ఓట్ల శాతం పెరగ్గా.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ముఖం చాటేయటంతో ప్రధానపార్టీలు గెలుపోటముల లెక్కల్లో తలమునకలయ్యాయి.