స్వీయ మదింపు.. బరితెగింపు
గచ్చిబౌలిలోని ఓ భవనానికి డిసెంబరు 14, 2022న ఆన్లైన్లో స్వీయ మదింపు ద్వారా పన్ను మదింపు జరిగింది. 1120007476, 1120007477, 1120007478, 1120007479 పీటీఐఎన్లతో భవనంలోని ఒక్కో ఇంటికి రూ.4 చొప్పున పన్ను పడింది.
రూ.లక్ష తీసుకుని రూ.4 పన్ను విధించిన అధికారులు
శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్లలో బేరసారాలు
బల్దియా ఖజానాకు రూ.300 కోట్ల గండి
ఈనాడు, హైదరాబాద్
గచ్చిబౌలిలోని ఓ భవనానికి డిసెంబరు 14, 2022న ఆన్లైన్లో స్వీయ మదింపు ద్వారా పన్ను మదింపు జరిగింది. 1120007476, 1120007477, 1120007478, 1120007479 పీటీఐఎన్లతో భవనంలోని ఒక్కో ఇంటికి రూ.4 చొప్పున పన్ను పడింది. ఇంటి విస్తీర్ణాన్ని ఒక చదరపు అడుగుగా(ఎస్ఎఫ్టీ), కాలనీని మురికివాడగా చూపడంతో పన్ను అంత తక్కువ వచ్చింది. మరుసటి రోజే.. ఆయా ఇంటి నంబర్ల పన్నును సవరించాలని బల్దియాకు ఆన్లైన్లో మళ్లీ దరఖాస్తు చేరింది. అందులో వాస్తవ ఎస్ఎఫ్టీని పేర్కొనడంతో.. పన్ను రూ.31,502కు పెరిగింది. ఒకేసారి వాస్తవ విస్తీర్ణం, చిరునామాను సరిగా పేర్కొంటూ ఆన్లైన్లో పన్ను మదింపునకు దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం.. వాటి పన్ను రూ.45వేల నుంచి రూ.50వేల మేర ఉండేది. పూర్తిస్థాయి దళారీ అవతారమెత్తిన శేరిలింగంపల్లి సర్కిల్ అధికారి ఈ తతంగాన్ని నడిపించారు. రూ.లక్షల్లో పన్ను పడే ఇంటి యజమానులతో బేరాలు కుదుర్చుకుని.. స్వీయ మదింపు విధానాన్ని దుర్వినియోగం చేశారు. ఈ రకంగా.. ఒక్క శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల కారణంగా జీహెచ్ఎంసీ ఆదాయానికి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ.50కోట్ల గండి పడింది. నగర వ్యాప్తంగా బల్దియాకు గడిచిన రెండేళ్లలో రూ.300కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అందుకు సంబంధించిన నకిలీ పన్ను మదింపు ఆధారాలను ‘ఈనాడు’ సేకరించింది. దస్త్రాలను విశ్లేషించగా.. దందాలో కింది స్థాయి నుంచి కేంద్ర కార్యాలయంలోని అదనపు కమిషనర్ ఆఫీసులోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది.
ఒక్కో ఆర్థిక సంవత్సరం..
- శేరిలింగంపల్లి సర్కిల్లో ఆర్థిక సంవత్సరం 2022-23లో స్వీయ మదింపు ద్వారా తక్కువ ఎస్ఎఫ్టీని చూపించి 934 ఇళ్లకు కేవలం రూ.9లక్షల ఆస్తిపన్నును నిర్ధారించారు. వెంటనే మీసేవా కేంద్రాల్లో సవరణ దరఖాస్తులు పడ్డాయి. సవరణ దరఖాస్తుల్లో వాస్తవ ఎస్ఎఫ్టీని చూపడంతో పన్ను రూ.9లక్షల నుంచి రూ.3.94 కోట్లకు పెరిగింది. మొదటిసారే సరిగ్గా చేస్తే ఆదాయం రూ.5.5కోట్ల మేర ఉండేది.
- అదే సర్కిల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్వీయ మదింపు ద్వారా 159 ఆస్తులకు తక్కువ ఎస్ఎఫ్టీతో రూ.12లక్షల పన్ను విధించారు. సవరణ తర్వాత రూ.1.39 కోట్లకు పెరిగింది. ఒకేసారి వాస్తవ విస్తీర్ణానికి మదింపు చేసి ఉంటే రూ.4 కోట్ల పన్ను పడేది.
అవకాశమిస్తే దుర్వినియోగం..
స్వీయ మదింపు విధానాన్ని 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో పలువురు అవినీతి అధికారులు వసూళ్లకు వనరుగా మార్చుకున్నారు. నేరుగా ఇళ్ల యజమానులను సంప్రదించి.. స్వీయ మదింపు వల్ల నష్టపోతారని భయపెట్టారు. లంచం ఇస్తే.. సగం పన్నుకే ఇంటి నంబరు, పీటీఐఎన్ ఇస్తామని బేరాలు కుదుర్చుకున్నారు. ఈ తరహా దందా శేరిలింగంపల్లి జోన్లో అత్యధికంగా జరగ్గా.. ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖులు ఓట్లు ఎక్కడ వేస్తారంటే..
[ 30-11-2023]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేస్తారో ఆ వివరాలివీ.. -
ఒక్క ఓటు.. ఐదేళ్ల భవిత
[ 30-11-2023]
ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురువారం జరిగే పోలింగ్పై ఆధారపడి ఉంది. ప్రజారంజక పాలన అందించగలిగే నేతను గెలిపించుకునే తరుణమిది. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికల నియమావళి పాటించాల్సిందే. -
గుబుల్ గుబుల్గా గుండెలధరగా..
[ 30-11-2023]
అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా. -
లిఖిద్దాం.. సిరా శాసనం
[ 30-11-2023]
వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. -
కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే
[ 30-11-2023]
ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. -
కొనుగోలులో పోటాపోటీ
[ 30-11-2023]
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు -
ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి
[ 30-11-2023]
నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. -
డబ్బుతో దొరికితే.. దంచుడే!
[ 30-11-2023]
ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది -
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
[ 30-11-2023]
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై కేసు
[ 30-11-2023]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది -
పార్కిన్సన్స్ రోగులకు నిమ్స్లో ప్రత్యేక చికిత్స
[ 30-11-2023]
పార్కిన్సన్స్ రోగుల కోసం నిమ్స్లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. -
కేసీఆర్కు చికిత్స అందించిన నిమ్స్ వైద్యులకు సన్మానం
[ 30-11-2023]
2009 నవంబరులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు -
అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు
[ 30-11-2023]
ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. -
థర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 30-11-2023]
మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్పహాడ్ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. -
కాపలాదారులు లేక వెలవెల
[ 30-11-2023]
ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు -
అభ్యర్థుల్లో గుర్తుల గుబులు
[ 30-11-2023]
అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి -
ఓటేద్దాం.. కదిలి రండి
[ 30-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు -
ఓటు వేయండి..నలుగురితో వేయించండి
[ 30-11-2023]
ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. -
కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు
[ 30-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్లలో అమర్చిన వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్రూంలను ఏర్పాటు చేశారు. -
రీ పోలింగ్కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 30-11-2023]
జిల్లాలో రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు -
ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం
[ 30-11-2023]
ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్ నమోదవుతోంది -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
[ 30-11-2023]
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.