రోజూ వెళ్లాలె.. చెత్త తేవాలె
ప్రతి ఇంటికి నిత్యం చెత్త ఆటో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు.
ఇంటింటి నుంచి సేకరణపై బల్దియా సర్వే
మంత్రి కేటీఆర్ ఆదేశంతో కదిలిన అధికారులు
ఈనాడు, హైదరాబాద్: ప్రతి ఇంటికి నిత్యం చెత్త ఆటో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు. కమిషనర్ ఆదేశాలతో సహాయ వైద్యాధికారులు, కేంద్ర కార్యాలయంలోని ఆరోగ్య విభాగం ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు.. యంత్రాంగమంతా సర్వేకు నడుం బిగించింది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ కేంద్రాలవారీగా జరుగుతున్న ఓటరు పరిశీలనతోపాటు.. ఆయా ఇళ్లకు స్వచ్ఛ ఆటోలు రోజూ వస్తున్నాయా.. లేదా.. ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి.. ఇతర సమస్యలేమైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇళ్ల లెక్కగడుతున్నారు. ఇళ్ల లెక్క తేలితే.. భౌగోళికంగా ప్రతి 500 ఇళ్లకు ఓ సరిహద్దు నిర్ధారించి.. వాటికి ఓ స్వచ్ఛ ఆటోను కేటాయించాలని భావిస్తున్నారు.
2 వేలకుపైగా ప్రాంతాల్లో కుప్పలు..
గ్రేటర్ పరిధిలో రోజు 7 వేల నుంచి 7,500 టన్నుల వరకు చెత్త సేకరణ జరుగుతోంది. అయినా నగరవ్యాప్తంగా 2 వేల నుంచి 2,500 చెత్త కుప్పలు ఏర్పడుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి చెత్త కుప్పలను తగ్గించాలని జీహెచ్ఎంసీ వేర్వేరు చర్యలు చేపట్టినా ఫలితం ఉండట్లేదు.
సగం ఇళ్లకు వెళ్లట్లేదు..
తెలంగాణ ఏర్పాటవగానే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి చెత్త సేకరణలోని మూడు చక్రాల రిక్షాలను తొలగించి.. ట్రాలీ ఆటోలను ప్రవేశపెట్టింది. నగరంలో ప్రస్తుతం 4,500 ఆటోలున్నాయి. సగటున ప్రతి 650 ఇళ్లకు ఓ ఆటో పని చేస్తోంది. కేటాయించిన వాటిలో సగం ఇళ్లకు స్వచ్ఛ ఆటోలు నిత్యం వెళ్లట్లేదు. కొన్ని ఆటోలు రోజుకు వంద ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తుండగా.. మరికొన్ని 200.. ఇంకొన్ని 300 గృహాల నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నాయి. నగరంలో 22 లక్షల ఇళ్లు ఉండగా.. పది లక్ష ఇళ్ల నుంచే ఆటోలు ఓ రోజు చెత్త సేకరిస్తున్నాయి. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం.. ఒక్కో ఆటో రోజుకు మూడు నుంచి ఐదు ట్రిప్పులు నడవాలని నిబంధన పెట్టింది. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు సగటున ఒకటిన్నర ట్రిప్పులు వేస్తున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
నిత్యం 500 ఇళ్లే
ఒక ఆటో రోజుకు 650 ఇళ్లను చుట్టడం సాధ్యం కాదని బల్దియాకు అర్థమైంది. దీంతో ఒక ఆటో రోజుకు 3 ట్రిప్పులు నడవాలనే నిబంధనను కఠినంగా అమలు చేయడం.. దానికి 500 ఇళ్లనే కేటాయించాలన్న తాజా నిర్ణయాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సర్వే చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిఖిద్దాం.. సిరా శాసనం
[ 30-11-2023]
వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. -
కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే
[ 30-11-2023]
ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. -
కొనుగోలులో పోటాపోటీ
[ 30-11-2023]
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు -
ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి
[ 30-11-2023]
నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. -
డబ్బుతో దొరికితే.. దంచుడే!
[ 30-11-2023]
ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది -
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
[ 30-11-2023]
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై కేసు
[ 30-11-2023]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది -
పార్కిన్సన్స్ రోగులకు నిమ్స్లో ప్రత్యేక చికిత్స
[ 30-11-2023]
పార్కిన్సన్స్ రోగుల కోసం నిమ్స్లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. -
కేసీఆర్కు చికిత్స అందించిన నిమ్స్ వైద్యులకు సన్మానం
[ 30-11-2023]
2009 నవంబరులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు -
అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు
[ 30-11-2023]
ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. -
థర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 30-11-2023]
మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్పహాడ్ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. -
కాపలాదారులు లేక వెలవెల
[ 30-11-2023]
ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు -
అభ్యర్థుల్లో గుర్తుల గుబులు
[ 30-11-2023]
అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి -
ఓటేద్దాం.. కదిలి రండి
[ 30-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు -
ఓటు వేయండి..నలుగురితో వేయించండి
[ 30-11-2023]
ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. -
కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు
[ 30-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్లలో అమర్చిన వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్రూంలను ఏర్పాటు చేశారు. -
రీ పోలింగ్కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 30-11-2023]
జిల్లాలో రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు -
ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం
[ 30-11-2023]
ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్ నమోదవుతోంది -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
[ 30-11-2023]
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.