రేషన్ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు
రేషన్ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు తప్పడం లేదు.. వేలిముద్రలు పడక పోవడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సెప్టెంబరు 1న ప్రారంభమైన కేవైసీ ప్రక్రియ నెలాఖరులోగా ముగుస్తుండటంతో.. లబ్ధిదారులంతా రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.
వేలిముద్రలు పడకపోవడంతో ‘మీసేవా’ చుట్టూ ప్రదక్షిణలు
రేషన్ దుకాణంలో కేవైసీ పునరుద్ధరించుకుంటున్న లబ్ధిదారుడు
ఈనాడు, హైదరాబాద్: రేషన్ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు తప్పడం లేదు.. వేలిముద్రలు పడక పోవడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సెప్టెంబరు 1న ప్రారంభమైన కేవైసీ ప్రక్రియ నెలాఖరులోగా ముగుస్తుండటంతో.. లబ్ధిదారులంతా రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్లు చేసుకొని దూరప్రాంతాలకు వెళ్లినవారికి.. వారి ప్రాంతాల్లో కొత్త కార్డులు ఇవ్వకపోవడంతో కేవైసీ పునరుద్ధరణ కోసం నగరానికొస్తున్నారు. కుటుంబాల్లో మృతిచెందినవారి పేర్లను కార్డుల నుంచి తొలగిస్తున్న పౌరసరఫరాలశాఖ.. మ్యుటేషన్ల(కార్డుల్లో పేర్ల చేర్పు)పై అలసత్వం ప్రదర్శించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సర్వర్ సమస్యలు..
ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ సరకులు, బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఇటీవలే కేవైసీ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రతిఒక్కరూ కేవైసీ చేయించుకునేలా పర్యవేక్షించాలన్న ఆదేశాలతో.. అధికారులు లబ్ధిదారులకు సమాచారం పంపారు. కుటుంబ సభ్యులంతా బయోమెట్రిక్ ద్వారా వివరాలను పునరుద్ధరించుకోవాలని సూచించడంతో వారంతా రేషన్ దుకాణాలకు పోటెత్తుతున్నారు. దీంతో అనేక రేషన్ దుకాణాల్లో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్నారులు, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో వారి కేవైసీ ప్రక్రియ నిలిచిపోతోంది. దీంతో ఆధార్కార్డుల్లో మార్పులు(అప్డేట్) చేసుకుంటేనే కేవైసీ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఉన్నచోటే పునరుద్ధరించుకోండి
హైదరాబాద్ జిల్లాలో 6,36,617, రంగారెడ్డిలో 5,59,788, మేడ్చల్లో 5,24,449 కార్డుదారులుండగా... ఇందులో పెళ్లిళ్లు చేసుకొని, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు 10 నుంచి 15 శాతం మేరకు ఉన్నారని పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, నగరానికి రాకుండానే వారంతా తాము నివసించే ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు వెళ్లి కార్డు నంబర్ చెప్పి కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు.
కొత్త కార్డుల కోసం నిరీక్షణ
కార్డుల్లో మార్పులు చేస్తున్న క్రమంలో కొత్త పేర్ల నమోదుపైనా దృష్టిపెట్టాలంటూ లబ్ధిదారులు కోరుతున్నారు. కొత్తగా కుటుంబంలో అడుగుపెట్టిన వారికి, వారి పిల్లలకు ఆరోగ్య పథకాలు వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు. మూడు జిల్లాల్లో 90వేలకు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖులు ఓట్లు ఎక్కడ వేస్తారంటే..
[ 30-11-2023]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేస్తారో ఆ వివరాలివీ.. -
ఒక్క ఓటు.. ఐదేళ్ల భవిత
[ 30-11-2023]
ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురువారం జరిగే పోలింగ్పై ఆధారపడి ఉంది. ప్రజారంజక పాలన అందించగలిగే నేతను గెలిపించుకునే తరుణమిది. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికల నియమావళి పాటించాల్సిందే. -
గుబుల్ గుబుల్గా గుండెలధరగా..
[ 30-11-2023]
అబ్బే.. ఇతర పార్టీల నుంచి పోటీనే లేదు. అధిక మెజార్టీతో గెలిచి తీరతాం.. ఇదీ రెండుమూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఓ నేత ధీమా. -
లిఖిద్దాం.. సిరా శాసనం
[ 30-11-2023]
వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. -
కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే
[ 30-11-2023]
ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. -
కొనుగోలులో పోటాపోటీ
[ 30-11-2023]
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు -
ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి
[ 30-11-2023]
నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. -
డబ్బుతో దొరికితే.. దంచుడే!
[ 30-11-2023]
ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది -
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
[ 30-11-2023]
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై కేసు
[ 30-11-2023]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది -
పార్కిన్సన్స్ రోగులకు నిమ్స్లో ప్రత్యేక చికిత్స
[ 30-11-2023]
పార్కిన్సన్స్ రోగుల కోసం నిమ్స్లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. -
కేసీఆర్కు చికిత్స అందించిన నిమ్స్ వైద్యులకు సన్మానం
[ 30-11-2023]
2009 నవంబరులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు -
అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు
[ 30-11-2023]
ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. -
థర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 30-11-2023]
మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్పహాడ్ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. -
కాపలాదారులు లేక వెలవెల
[ 30-11-2023]
ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు -
అభ్యర్థుల్లో గుర్తుల గుబులు
[ 30-11-2023]
అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి -
ఓటేద్దాం.. కదిలి రండి
[ 30-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు -
ఓటు వేయండి..నలుగురితో వేయించండి
[ 30-11-2023]
ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. -
కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు
[ 30-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్లలో అమర్చిన వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్రూంలను ఏర్పాటు చేశారు. -
రీ పోలింగ్కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 30-11-2023]
జిల్లాలో రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు -
ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం
[ 30-11-2023]
ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్ నమోదవుతోంది -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
[ 30-11-2023]
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.