Hyderabad: బోర్డు తిప్పేసిన కుబేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వ్యవసాయ భూములపై రూ.కోట్లలో రుణాలు ఇస్తామని నమ్మించి, ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.2 కోట్లకుపైగా దండుకొని బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. బాధితులు శనివారం సైఫాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
రూ.2 కోట్లపైగా వసూలు చేశారని బాధితుల ఆవేదన
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
సంస్థ కార్యాలయం
నారాయణగూడ, న్యూస్టుడే: వ్యవసాయ భూములపై రూ.కోట్లలో రుణాలు ఇస్తామని నమ్మించి, ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.2 కోట్లకుపైగా దండుకొని బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. బాధితులు శనివారం సైఫాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన అమిత్కుమార్ కొంపల్లిలో నివశిస్తూ బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్ నాలుగో అంతస్తులోని ఫ్లాట్ నెంబరు 407లో ‘కుబేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్’ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములపై తక్కువ వడ్డీకి, ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణాలు ఇస్తామని ప్రకటించుకున్నాడు. ఓ వెబ్సైట్ రూపొందించి దేశవ్యాప్తంగా 28 శాఖలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని పేర్కొన్నాడు. దాంతో చాలా మంది రుణాల కోసం ఆసక్తి చూపారు. దరఖాస్తుదారులు ముందుగా రూ.5 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, దరఖాస్తు నింపి కావాల్సిన రుణ మొత్తం వివరిస్తూ ఆధార్, పాన్ కార్డు, వంటగ్యాస్ రశీదు జత చేయాలని సూచించాడు. తర్వాత సీఏ రిపోర్టు, ఇతరాత్ర పత్రాలు, ప్రాసెసింగ్ ఫీజు అంటూ రూ.25వేల నుంచి రూ.30 వేలు (రుణాన్ని బట్టి) వసూలు చేశాడు. కొందరు అధిక రుణం కోసం రూ.లక్ష నుంచి రూ.4లక్షలకుపైగా చెల్లించారు. బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, ఐడీబీఐ బ్యాంక్ల ద్వారా రుణాలు వస్తాయని వారిని నమ్మించాడు. కంపెనీ బోర్డు తిప్పేసిందని తెలియక శనివారం ఓ వ్యక్తి డిపాజిట్ చెల్లించడానికి రూ.2 లక్షలు తీసుకురావడం గమనార్హం.
అప్రమత్తం చేసినా..: కుబేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పనితీరుపై అనుమానం వచ్చి బాబుఖాన్ ఎస్టేట్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి పి.వేణుమాధవ్ ఈనెల 21న సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించ లేదని ఆయన పేర్కొన్నారు.
పత్రాలు ధ్వంసం?
రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు గత కొద్ది రోజులుగా అమిత్కుమార్ను ప్రశ్నిస్తుండగా, సెప్టెంబరు 26 నాటికి రుణాలకు సంబంధించిన చెక్కులు ఇస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సిబ్బందిని ఇంటికి పంపించి, దరఖాస్తులు, అగ్రిమెంట్లు తదితర 700-800 ఫైళ్లకు నిప్పుపెట్టారు. సీసీ కెమెరాలు విరగొట్టి ఆధారాలు లేకుండా చేశాడని బాధితులు వాపోయారు. శనివారం ఉదయం వచ్చిన కొందరు బాధితులు కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరికొందరు ఏసీలు, కంప్యూటర్లు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిఖిద్దాం.. సిరా శాసనం
[ 30-11-2023]
వ్యాంగులు, 80ఏళ్లు, ఆపై వయస్సున్న వయోధికులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రంలో..ఏ గంటకు ఏం జరుగుతుందంటే
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకోసారి ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు, చివరగా సాయంత్రం 5గంటలకు ప్రకటిస్తారు. -
కోటికి పైగా ఓటర్ల తీర్పు నేడే
[ 30-11-2023]
ఓట్ల పండగకు సర్వం సిద్ధమైంది. రాజధానిలో మూడు జిల్లాలు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం కలిపి మొత్తం 29 స్థానాల్లోని ఒక కోటి 12 లక్షల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లడమే తరువాయి. -
కొనుగోలులో పోటాపోటీ
[ 30-11-2023]
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాజధానిలో గెలిచే స్థానాలే కీలకం కావడంతో కనీసం 15 నుంచి 18 సీట్లు దక్కించుకునేందుకు అధికార భారాస, కాంగ్రెస్ అగ్రనేతలు చివరి క్షణంలో కూడా ఎత్తులు వేస్తున్నారు -
ఎలాగైనా ఊరెళ్లాలి.. ఓటేసి తీరాలి
[ 30-11-2023]
నగరం నుంచి ఊరెళ్లి ఓటేద్దామని చూసేవారిలో ఎక్కువ మంది యుక్త వయసువారే కనిపించారు. -
డబ్బుతో దొరికితే.. దంచుడే!
[ 30-11-2023]
ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న చోటామోటా నేతలకు ప్రత్యర్థి పార్టీల భయం పట్టుకుంది -
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
[ 30-11-2023]
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై కేసు
[ 30-11-2023]
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది -
పార్కిన్సన్స్ రోగులకు నిమ్స్లో ప్రత్యేక చికిత్స
[ 30-11-2023]
పార్కిన్సన్స్ రోగుల కోసం నిమ్స్లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. -
కేసీఆర్కు చికిత్స అందించిన నిమ్స్ వైద్యులకు సన్మానం
[ 30-11-2023]
2009 నవంబరులో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు -
అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు
[ 30-11-2023]
ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. -
థర్మకోల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 30-11-2023]
మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్పహాడ్ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. -
కాపలాదారులు లేక వెలవెల
[ 30-11-2023]
ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు -
అభ్యర్థుల్లో గుర్తుల గుబులు
[ 30-11-2023]
అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. తమ పార్టీ గుర్తులను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడంతో గెలుపుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా భారాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు ఇబ్బంది పెడుతున్నాయి -
ఓటేద్దాం.. కదిలి రండి
[ 30-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని విధాల రంగం సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు (వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్) నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు -
ఓటు వేయండి..నలుగురితో వేయించండి
[ 30-11-2023]
ఓటేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే నేతను ఎంపిక చేసుకోవాలి. విద్యావంతులు, అవినీతికి దూరంగా ఉండేవాళ్లను గుర్తించి ఓటేయాలి. -
కమాండ్ కంట్రోల్ రూంల ఏర్పాటు
[ 30-11-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్లలో అమర్చిన వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్రూంలను ఏర్పాటు చేశారు. -
రీ పోలింగ్కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 30-11-2023]
జిల్లాలో రీపోలింగ్కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు -
ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం
[ 30-11-2023]
ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్ నమోదవుతోంది -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
[ 30-11-2023]
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.