రహదారులా.. నీటి గుంతలా..!
ప్రజా ప్రయోజనార్ధం చేపట్టే నిర్మాణాలు మన్నికతో ఉండాలి. ముఖ్యంగా రోడ్లు తప్పనిసరిగా నాణ్యతతో పదికాలాలపాటు ఉపయోగపడాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. కానీ ఏం లాభం.
రూ.75 కోట్ల వ్యయం
మాదిరి వర్షాలకే అధ్వానం
న్యూస్టుడే, తాండూరు
తాండూరు -తొర్మామిడి మార్గంలో నిలిచిన వర్షపు నీరు
ప్రజా ప్రయోజనార్ధం చేపట్టే నిర్మాణాలు మన్నికతో ఉండాలి. ముఖ్యంగా రోడ్లు తప్పనిసరిగా నాణ్యతతో పదికాలాలపాటు ఉపయోగపడాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. కానీ ఏం లాభం. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల ఇష్టారాజ్యం.. వెరసి వేసిన మూణ్ణాళ్లకే గుంతలు తేలి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఇందుకు రూ.24 కోట్లు పోసి తాండూరులో నిర్మించి రోడ్లు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.
కేవలం కంకరపరిచి, మట్టిపోసి..
తాండూరు నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా మారిన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనాలు వెళ్లాలంటే వీలుకాని పరిస్థితి. తాండూరు నుంచి తొర్మామిడి వరకు 2017-18 లో రూ.24 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు. మార్గమధ్యలోని ఇందూరు గ్రామం వద్ద కేవలం కంకర పరిచి మట్టిని పోసి వదిలేశారు. తారు వేయాల్సి ఉన్నా వేయలేదు. తాజా వర్షాలకు మట్టి కొట్టుకు పోయింది. రోడ్డు గుంతలుగా మారడంతో వాన నీరు నిలిచి వాహనం కదలాలంటే తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు.
తాండూరు నుంచి తట్టేపల్లి, తొర్మామిడి, బొపునారం, మల్చల్మా, షేకాపూర్ జహీరాబాద్తో పాటు కర్ణాటక రాష్ట్రం కుంచవరం తదితర గ్రామాలకు ఇది రోడ్డుపై నుంచి నిత్యం వందలకొద్దీ వాహనదారులు ప్రయాణాలు చేస్తారు. ఇదే రోడ్డు మార్గంలోని అత్కూరు గుట్ట పై భాగాన వేసిన ఒక వరుస తారు రోడ్డు రెండు వైపులా కొసలు కోసుకు కోసుకుపోయాయి. గుట్టపై నుంచి ప్రయాణం చేయాలంటే ప్రమాదకరంగా మారింది. కొన్నిచోట్ల తారు లేచిపోయి గుంతలు పడింది. వేసవిలో రహదారిని బాగు చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉన్న అధికారులు పట్టించుకోలేదని విమర్శలున్నాయి.
హైదరాబాద్ వైపు వెళ్లేది ఇప్పటికీ అసంపూర్ణం
తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు కూడా అధ్వానంగా మారింది. 2017లో రూ.51 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు అసంపూర్తిగానే ఉంది. వికారాబాద్, హైదరాబాద్ వైపు వెళ్లే వేలకొద్ది వాహనదారులు అధ్వాన రోడ్డు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రహదారి గుంతలమయంగా మారింది. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తమ అవస్థలు చూసైనా అధికారులు స్పందించాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. వర్షాలు తెరిపివ్వగానే రహదారిని బాగు చేయాలని రహదారులు, భవనాల శాఖ అధికారులకు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad: తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు
[ 28-11-2023]
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
Rahul Gandhi: భాజపా చెప్పిన చోటే మజ్లిస్ పోటీ: రాహుల్ గాంధీ
[ 28-11-2023]
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భాజపా నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందని విమర్శించారు. -
MP Laxman: కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్
[ 28-11-2023]
కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Rahul Gandhi: కాంగ్రెస్ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్గాంధీ
[ 28-11-2023]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
Hyderabad: ఫోన్ వచ్చిందంటే ఓటు ఉన్నట్లే
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరింది. మంగళవారం సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడనుంది. అభ్యర్థులు నియోజకవర్గంలోని ఓటర్లను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయండి
[ 28-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అన్ని సౌకర్యాలతో కూడిన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ ఈ నెల 30న నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ సూచించారు. -
నేతలకు ‘నోట్ల చిక్కులు’
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారంలో డబ్బు బాధ్యతలు చూస్తున్న నేతలకు ‘నోట్ల చిక్కులు’ తలనొప్పులు తెప్పిస్తున్నాయి. -
భరోసా ఇస్తున్నా..మూడోసారి వస్తున్నా
[ 28-11-2023]
నగర శివారులో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. సోమవారం షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. -
2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లు
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రైడ్ షేరింగ్ వేదిక ర్యాపిడో సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పోలింగ్ రోజున 2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లను అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
కమల దళపతి.. జనహారతి
[ 28-11-2023]
ఓవైపు అభిమానులు.. మరోవైపు కాషాయ శ్రేణులు.. ఎటుచూసిన నమో.. మోదీ.. నినాదాలు.. నగరం నడిబొడ్డున సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో కోలాహలంగా సాగింది -
జీవశాస్త్ర పరిశోధనల్లో మేటి
[ 28-11-2023]
జీవశాస్త్ర పరిశోధనల్లో దేశంలోనే సీసీఎంబీ అత్యుత్తమ సంస్థ అని కేంద్రంలోని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేశ్ గోఖలే అన్నారు. -
అభ్యర్థులకు ప్రశంసలు.. అధినేతకు అభినందనలు
[ 28-11-2023]
‘మీ అభ్యర్థి అంజయ్య యాదవ్ ఆజాత శత్రువు.. వజ్రంలాంటి మనిషి.. చీమకు కూడా హాని చేయడు.. ఎప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తాడు. -
పోలీసు బలగం సిద్ధం
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికలకు మహా నగర పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్తో పాటు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు, ప్రత్యేక, రిజర్వు ఫోర్స్ పేర్లతో అంచెలవారీ విధానం అమలుచేస్తున్నారు. -
సుస్థిర ప్రభుత్వమా?.. తరచూ మారే సీఎంలా?
[ 28-11-2023]
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండాలా? ఆర్నెల్లకోసారి మారే ముఖ్యమంత్రులు కావాలా? రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు -
నమూనా ఈవీఎంతో ఓటరుకు అవగాహన
[ 28-11-2023]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ప్రతాప్రెడ్డి అన్నారు -
మార్పు కోరుతున్న ప్రజలు
[ 28-11-2023]
నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని భాజపా అభ్యర్థి కె.ఎస్.రత్నం అన్నారు -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 28-11-2023]
సజావుగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం
[ 28-11-2023]
ఆన్లైన్ మోసాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ రైల్వే పోలీసులు కోరారు. -
రెండు చోట్ల నగదు పంపిణీ కలకలం
[ 28-11-2023]
మేడ్చల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం కలకలం రేపింది. -
ఆరోగ్య భాగ్యానికి ఓంకారం సహకారం
[ 28-11-2023]
స్థానిక సీతారాంబాగ్లోని ప్రాచీన శ్రీరామమందిరంలో గత అక్టోబర్ 15 నుంచి ఈ నెల 27 వరకు నిర్వహించిన భారత భాగ్య సమృద్ధి యజ్ఞం శనివారం ముగిసింది -
6 నెలలు.. 1.20 కోట్ల మంది ప్రయాణికులు
[ 28-11-2023]
విమాన ప్రయాణికుల ఆదరణలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన శంషాబాద్ విమానాశ్రయం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. -
పదవక్కర్లేదన్నారు..మార్పు కావాలన్నారు
[ 28-11-2023]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనకు పదవి వద్దని, తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. -
డబ్బులు పంపిణీ చేస్తున్నారని వాగ్వాదం
[ 28-11-2023]
భారాస కార్యాలయంలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో కాంగ్రెస్ నాయకులు, భారాస కార్యాలయంలోకి సోమవారం దూసుకెళ్లారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే ఆనంద్తో పాటు భారాస కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది -
భారాసతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 28-11-2023]
మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఏర్పుమళ్ల, దుద్యాల మండలకేంద్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పూర్తి.. ఏ క్షణమైనా కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు