Hyderabad-ORR: వరుస తప్పింది.. ఆయువు తీరింది
ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని పీ అండ్ టీ కాలనీకి చెందిన సింగిరెడ్డి జీవన్రెడ్డి(23) మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది.
ఔటర్పై కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి
ప్రమాదం (ఊహాచిత్రం)
అబ్దుల్లాపూర్మెట్, బోడుప్పల్, న్యూస్టుడే: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని పీ అండ్ టీ కాలనీకి చెందిన సింగిరెడ్డి జీవన్రెడ్డి(23) మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. కంటైనర్ లారీ డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఘటనకు కారణమైంది. అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల వివరాల ప్రకారం.. జీవన్రెడ్డి సోమవారం సాయంత్రం తన కారులో ఔటర్ రింగురోడ్డు మీదుగా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి బయలుదేరాడు. ఆయన నాలుగో వరుసలో ప్రయాణిస్తున్నాడు. అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ ప్రాంతంలోని ఎగ్జిట్ 10 సమీపానికి చేరుకున్న వేళ.. ముందు వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా వాహన వేగం ఒక్కసారిగా తగ్గించి మూడో వరుస నుంచి నాలుగో వరుసలోకి వచ్చాడు. వెనుక నుంచి జీవన్రెడ్డి కారు లారీని బలంగా ఢీకొట్టి చొచ్చుకొని వెళ్లింది. అందులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ దినేష్కుమార్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న జీవన్రెడ్డి చదువులు పూర్తి కాగానే విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని తండ్రి నరేందర్రెడ్డి తెలిపారు.
సింగిరెడ్డి జీవన్రెడ్డి
నిబంధనలు పాటించకే రక్తచారికలు
ఇలా వెళ్తే ఔటర్పై సాఫీ ప్రయాణమే
నిపుణుల సూచనలివి..
ఔటర్ రింగురోడ్డుపై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి వాహనదారులు మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల బారినపడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కనీస నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
- ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1-2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్ఠంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి.
- లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా(జిగ్జాగ్) ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే అకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి.
- వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం.
- సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి.
- ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి.
- ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీస్ లేన్పై ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లో ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు.
- ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో అపసవ్య దిశ(రాంగ్రూట్)లో ప్రయాణించకూడదు.
ప్రమాదాలకు ఇవీ కారణాలు
- 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 1.5 లక్షకుపైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ను(వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
- ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు.
- కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Elections: ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్: సీపీ శాండిల్య
[ 28-11-2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియడంతో హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. -
Vikasraj: సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
[ 28-11-2023]
ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ (CEO Vikasraj) తెలిపారు. -
Telangana Elections: పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలి: వికాస్ రాజ్
[ 28-11-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana elections) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas raj) తెలిపారు. -
Hyderabad: తెలంగాణ ఎన్నికలు.. విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు
[ 28-11-2023]
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
Rahul Gandhi: భాజపా చెప్పిన చోటే మజ్లిస్ పోటీ: రాహుల్ గాంధీ
[ 28-11-2023]
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో భాజపా నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందని విమర్శించారు. -
MP Laxman: కాంగ్రెస్ బూటకపు హామీలతో మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్
[ 28-11-2023]
కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
Rahul Gandhi: కాంగ్రెస్ గెలవగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్గాంధీ
[ 28-11-2023]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులు సహా డెలివరీ బాయ్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
Hyderabad: ఫోన్ వచ్చిందంటే ఓటు ఉన్నట్లే
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరింది. మంగళవారం సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడనుంది. అభ్యర్థులు నియోజకవర్గంలోని ఓటర్లను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్) ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయండి
[ 28-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అన్ని సౌకర్యాలతో కూడిన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ ఈ నెల 30న నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ సూచించారు. -
నేతలకు ‘నోట్ల చిక్కులు’
[ 28-11-2023]
ఎన్నికల ప్రచారంలో డబ్బు బాధ్యతలు చూస్తున్న నేతలకు ‘నోట్ల చిక్కులు’ తలనొప్పులు తెప్పిస్తున్నాయి. -
భరోసా ఇస్తున్నా..మూడోసారి వస్తున్నా
[ 28-11-2023]
నగర శివారులో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. సోమవారం షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. -
2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లు
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రైడ్ షేరింగ్ వేదిక ర్యాపిడో సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పోలింగ్ రోజున 2,600 పోలింగ్ బూత్లకు ఉచిత రైడ్లను అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
కమల దళపతి.. జనహారతి
[ 28-11-2023]
ఓవైపు అభిమానులు.. మరోవైపు కాషాయ శ్రేణులు.. ఎటుచూసిన నమో.. మోదీ.. నినాదాలు.. నగరం నడిబొడ్డున సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో కోలాహలంగా సాగింది -
జీవశాస్త్ర పరిశోధనల్లో మేటి
[ 28-11-2023]
జీవశాస్త్ర పరిశోధనల్లో దేశంలోనే సీసీఎంబీ అత్యుత్తమ సంస్థ అని కేంద్రంలోని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేశ్ గోఖలే అన్నారు. -
అభ్యర్థులకు ప్రశంసలు.. అధినేతకు అభినందనలు
[ 28-11-2023]
‘మీ అభ్యర్థి అంజయ్య యాదవ్ ఆజాత శత్రువు.. వజ్రంలాంటి మనిషి.. చీమకు కూడా హాని చేయడు.. ఎప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తాడు. -
పోలీసు బలగం సిద్ధం
[ 28-11-2023]
శాసనసభ ఎన్నికలకు మహా నగర పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్తో పాటు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు, ప్రత్యేక, రిజర్వు ఫోర్స్ పేర్లతో అంచెలవారీ విధానం అమలుచేస్తున్నారు. -
సుస్థిర ప్రభుత్వమా?.. తరచూ మారే సీఎంలా?
[ 28-11-2023]
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండాలా? ఆర్నెల్లకోసారి మారే ముఖ్యమంత్రులు కావాలా? రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు -
నమూనా ఈవీఎంతో ఓటరుకు అవగాహన
[ 28-11-2023]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ప్రతాప్రెడ్డి అన్నారు -
మార్పు కోరుతున్న ప్రజలు
[ 28-11-2023]
నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని భాజపా అభ్యర్థి కె.ఎస్.రత్నం అన్నారు -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 28-11-2023]
సజావుగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం
[ 28-11-2023]
ఆన్లైన్ మోసాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ రైల్వే పోలీసులు కోరారు. -
రెండు చోట్ల నగదు పంపిణీ కలకలం
[ 28-11-2023]
మేడ్చల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం కలకలం రేపింది. -
ఆరోగ్య భాగ్యానికి ఓంకారం సహకారం
[ 28-11-2023]
స్థానిక సీతారాంబాగ్లోని ప్రాచీన శ్రీరామమందిరంలో గత అక్టోబర్ 15 నుంచి ఈ నెల 27 వరకు నిర్వహించిన భారత భాగ్య సమృద్ధి యజ్ఞం శనివారం ముగిసింది -
6 నెలలు.. 1.20 కోట్ల మంది ప్రయాణికులు
[ 28-11-2023]
విమాన ప్రయాణికుల ఆదరణలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిన శంషాబాద్ విమానాశ్రయం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. -
పదవక్కర్లేదన్నారు..మార్పు కావాలన్నారు
[ 28-11-2023]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనకు పదవి వద్దని, తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. -
డబ్బులు పంపిణీ చేస్తున్నారని వాగ్వాదం
[ 28-11-2023]
భారాస కార్యాలయంలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న అనుమానంతో కాంగ్రెస్ నాయకులు, భారాస కార్యాలయంలోకి సోమవారం దూసుకెళ్లారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే ఆనంద్తో పాటు భారాస కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది -
భారాసతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 28-11-2023]
మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఏర్పుమళ్ల, దుద్యాల మండలకేంద్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Ap High court: కోడికత్తి కేసు.. కౌంటరు దాఖలు చేసిన ఎన్ఐఏ
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
-
1 నుంచి TCS బైబ్యాక్.. 20 శాతం ప్రీమియంతో షేర్ల కొనుగోలు
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్