గంట వర్షం.. మూడు గంటల నరకం
నగరంలో గంటపాటు కురిసిన భారీ వర్షం వాహనదారులకు నరకం చూపించింది. బుధవారం సాయంత్రం దాదాపు ఏకధాటి వర్షంతో రహదారులు నీట మునిగాయి.
ఈనాడు-హైదరాబాద్, రాయదుర్గం, న్యూస్టుడే: నగరంలో గంటపాటు కురిసిన భారీ వర్షం వాహనదారులకు నరకం చూపించింది. బుధవారం సాయంత్రం దాదాపు ఏకధాటి వర్షంతో రహదారులు నీట మునిగాయి. ప్రధాన జంక్షన్లు, కూడళ్లు వాహనాలతో కిక్కిరిసి పోయాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మెహదీపట్నం, టోలీచౌకి, సోమాజిగూడ, మాదాపూర్, షేక్పేట, ఖాజాగూడ చౌరస్తా, చాదర్ఘాట్, అమీర్పేట ప్రాంతాల్లో ఎటుచూసినా వాహనాలే కనిపించాయి. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంది. మాదాపూర్ శిల్పారామం నుంచి సోమాజిగూడ మధ్య దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం పట్టింది. అత్తాపూర్లో పిల్లర్ 191 దగ్గర భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్, బాటా షోరూం, గచ్చిబౌలి డాగ్స్ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఐటీ కారిడార్లో అస్తవ్యస్తం
బయో డైవర్సిటీ కూడలి, ఖాజాగూడ చౌరస్తా, గచ్చిబౌలి పిస్తా హౌస్ల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐటీ కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడం.. ఒక్కసారిగా లక్షలాది వాహనాలు రహదారి మీదకు చేరడంతో కిలోమీటరు ప్రయాణానికి అరగంట సమయం వరకు పట్టింది. షేక్పేట పైవంతెన మీదుగా మెహదీపట్నంకు వెళ్లే మార్గంలోని బృందావన్ కాలనీ దగ్గర బుల్కాపూర్ నాలా పొంగి ప్రధాన రహదారి మీదకు వరద చేరింది. మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలు షేక్పేట పైవంతెన మీద ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బయో డైవర్సిటీ పార్కు పైవంతెన దగ్గర భారీగా నీరు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
[ 08-12-2023]
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు. -
ధరణి పోర్టల్ ఉద్యోగులపై కేసు నమోదు
[ 08-12-2023]
ధరణి పోర్టల్లో పనిచేస్తున్న ఆపరేటర్, కోఆర్డినేటర్పై కేసు నమోదైంది. ఏఓ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు మహేష్, నరేష్పై కేసు నమోదు చేశారు. -
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
[ 08-12-2023]
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
[ 08-12-2023]
విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్కో, జెన్కో అధికారులు పాల్గొన్నారు. -
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ
[ 08-12-2023]
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్తో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. -
Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి: అధికారులకు సీఎం ఆదేశం
[ 08-12-2023]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
Revanth Reddy: ‘ప్రజాదర్బార్’ ప్రారంభం.. అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
[ 08-12-2023]
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
వినూత్నంగా ఆన్లైన్ పాఠాలు
[ 08-12-2023]
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇకపై ఇంజినీరింగ్ విద్యార్థులకు వినూత్నంగా ఆన్లైన్ పాఠాలను బోధించనుంది. ఇంజినీరింగ్ విద్యలో కృత్రిమమేధ, డేటాసైన్స్, చాట్జీపీటీ ,సైబర్ భద్రత కోర్సులపై మరింత అవగాహన కల్పించేందుకు ఆచార్యులతో పాటు వృత్తినిపుణులతో తరగతులను నిర్వహించనుంది. -
అతిరథులు తరలిరాగా... సారథి కొలువుదీరగా
[ 08-12-2023]
ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపట్టారు. ఆయనను అభినందించేందుకు పలువురు నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు వరుసకట్టారు. -
వారిద్దరికే బాధ్యతలు ఇవ్వడం ఎందుకో?
[ 08-12-2023]
ధరణి పోర్టల్లో కొందరు అక్రమార్కులకు అనుకూలంగా పాస్పుస్తకాల్లో మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లు చేసిన వ్యవహారంలో ధరణి సమన్వయ కర్త నరేష్, ఆపరేటర్ మహేశ్ల నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇండియా విశ్వగురుగా ఆవిర్భవిస్తుంది
[ 08-12-2023]
భవిష్యత్తులో ఇండియా విద్యారంగంలో విశ్వగురుగా ఆవిర్భవిస్తుందని ఏఐసీటీఈ ఛైర్మన్ టి.జి.సీతారాం అన్నారు. గురువారం సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన ‘ఎడు సమ్మిట్-2023’లో ఆయన మాట్లాడారు. -
LRS: ఎల్ఆర్ఎస్పై ముందుకా.. వెనక్కా!
[ 08-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) మొదలుపెట్టిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ముందుకు సాగుతుందా.. నిలిచిపోనుందా అనే విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. -
కల్తీ దందాకు కేరాఫ్ హైదరాబాద్
[ 08-12-2023]
నగరం కల్తీ పరిశ్రమలకు కేరాఫ్గా మారిపోయింది. కల్తీ దందా నగరంలో జోరుగా సాగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. -
దళపతి.. సభాపతి మన జిల్లా వారే
[ 08-12-2023]
రాజకీయాల్లో ఉండే చాలా మంది ఎమ్మెల్యే కావాలని, శాసనసభకు వెళ్లి ‘అధ్యక్షా’ అనాలని, పిలిపించుకోవాలని కలలు కంటారు. ఇందుకు ఏళ్ల పాటు పోరాడుతుంటారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన వారికి సైతం అమాత్య యోగం దక్కితేనే అదో గొప్ప విజయం. -
కేడర్ను నిలబెట్టి.. విజయం చేపట్టి
[ 08-12-2023]
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ను పార్టీ ఎంపికచేసింది. ఆయన నియోజక వర్గంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 12వేలపై చిలుకు అధిక్యంతో విజయాన్ని సాధించారు. -
యోధులు వచ్చారు.. వికారాబాధలు తీరేనా!
[ 08-12-2023]
ప్రభుత్వ పాలనలోని కీలకపోస్టులతో జిల్లా ప్రత్యేకతను సంచరించుకుంది. ఈ జిల్లాకు చెందిన వారే ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, మరొకరికి స్పీకర్ పదవి వరించింది. -
భక్తి శ్రద్ధలతో అనంత గిరి ప్రదక్షిణ
[ 08-12-2023]
ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అనంత ‘గిరి’ (పాదయాత్ర) ప్రదక్షిణ గురువారం ప్రశాంతంగా సాగింది. జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, పుర అధ్యక్షురాలు మంజుల దంపతులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
కేతకిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పూజలు
[ 08-12-2023]
-
వైద్య పథకాల అమల్లో భాగస్వాముల్ని చేయండి: ఐఎంఏ
[ 08-12-2023]
కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ అభినందనలు తెలిపింది. రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గం తొలి సమావేశం గురువారం కోఠిలోని కార్యాలయంలో జరిగింది. -
శాఖల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలి
[ 08-12-2023]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం... మంత్రిత్వ శాఖల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ కోరారు. -
రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 08-12-2023]
రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) లోకేష్ విష్ణోయ్ తెలిపారు. గురువారం కాచిగూడ స్టేషన్లో.. లోకో పైలెట్లు, సహాయ లోకో పైలట్ల కుటుంబ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలోనూ బీసీ కులగణన చేపట్టాలి
[ 08-12-2023]
బిహార్ రాష్ట్రం తరహాలో తెలంగాణలోనూ బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హామీనిచ్చారన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
[ 08-12-2023]
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంతో రైతులు అవస్థలు పడుతున్నారంటూ గురువారం ‘ఈనాడు’లో ‘కల్లం దాటని ధాన్యం..కర్షకుల్లో కలవరం’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. -
కన్నబిడ్డపై లైంగిక దాడి యత్నం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
[ 08-12-2023]
కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల మేరకు.. వెంకట్రామ్రెడ్డినగర్లో సునైన, సునీల్ కుమార్ దంపతులు అద్దె ఇంట్లో ఉండేవారు. -
అనుమానాస్పద రీతిలో హైదరాబాద్ విద్యార్థి మృతి
[ 08-12-2023]
మైసూరు విశ్వవిద్యాలయ ప్రాంగణం ‘మానసగంగోత్రి’లోని ఒక కళాశాలలో చదువుతున్న అక్షజ్ (19) మృతదేహాన్ని జయలక్ష్మిపురంలోని ఓ వసతిగృహంలో గురువారం గుర్తించారు. అతని తల చుట్టూ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. -
కళింగ వైశ్య యువసేన కార్తిక వనభోజనాలు 9న
[ 08-12-2023]
కళింగ వైశ్య యువసేన ఆధ్వర్యంలో ఈనెల 9న కార్తిక మాస వనభోజన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి బొటానికల్గార్డెన్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
వీఏఓఏటీ జెన్కో అధ్యక్షుడిగా సత్యనారాయణ ప్రసాద్
[ 08-12-2023]
విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏఓఏటీ) జెన్కో విభాగం కార్యవర్గం ఎన్నికైంది. మింట్కాంపౌండ్లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి అతిథిగా సీఎఫ్ఓ అనురాధ, విశిష్ట అతిథులుగా విజయలక్ష్మి, సత్యరాజ్, భాస్కర్రావు హాజరయ్యారు. -
ఐఎస్బీలో సాయుధ దళాల సిబ్బందికి 50 శాతం ఫీజు రాయితీ
[ 08-12-2023]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో మేనేజ్మెంట్ విద్యలోని వివిధ కోర్సుల్లో సాయుధ దళాల సిబ్బందికి ట్యూషన్ ఫీజులో 50శాతం రాయితీ ఇస్తున్నట్లు ఐఎస్బీ ప్రకటించింది. -
ఆర్ఎంఎస్పై ఉచిత అవగాహన పరీక్ష 10న
[ 08-12-2023]
అఖిల భారత స్థాయిలో 6వ తరగతిలో ప్రవేశానికి జరిగే రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్(ఆర్ఎంఎస్) ప్రవేశ పరీక్షకు ఉచితంగా అవగాహన పరీక్ష నిర్వహించనున్నట్టు క్రాంతి కీన్ స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణి తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
David Warner: మిచెల్కు కౌంటర్.. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగా: వార్నర్
-
Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
-
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు