Hyderabad: అదంతా గతం సార్.. ఇప్పుడు మారిపోయా: డ్రగ్స్ నిందితుల విభిన్న సమాధానాలు
మాదక ద్రవ్యాల కేసులో లింకులు ఛేదించేందుకు టీఎస్న్యాబ్ పోలీసులు దూకుడు పెంచారు. మూలాలను గుర్తించి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలను రవాణా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలనుకుంటున్నారు.
నగర పోలీసులు అరెస్ట్ చేసిన నైజీరియన్
ఈనాడు, హైదరాబాద్: మాదక ద్రవ్యాల కేసులో లింకులు ఛేదించేందుకు టీఎస్న్యాబ్ పోలీసులు దూకుడు పెంచారు. మూలాలను గుర్తించి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలను రవాణా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలనుకుంటున్నారు. ఇటీవల మాదాపూర్ రేవ్పార్టీలో తెలుగు సినీ నిర్మాతలు, నటీనటుల బండారం బయటపడటం సంచలనంగా మారింది. ఇక్కడ లభించిన ఆధారాలతో బెంగళూరులోని డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారులు నైజీరియన్లను అరెస్టుచేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొందరిని మరోసారి విచారించేందుకు నోటీసులు జారీచేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ విచారించిన నిందితుల్లో అధికశాతం మంది విభిన్న సమాధానాలతో పోలీసులను కంగు తినిపించే ప్రయత్నం చేశారు. టీఎస్ న్యాబ్ పదేళ్లనాటి నిందితుల కాల్డేటా, ఛాటింగ్స్ బయటి తీసి ప్రశ్నించటంతో తాము అమాయకులమని, అప్పట్లో తెలియక మత్తుపదార్థాలు తీసుకున్నామంటూ ప్రాధేయపడినట్టు సమాచారం. తొలుత ఏవో సాకులు చెబుతూ తమకు డ్రగ్స్ అంటే తెలియవంటూ చెప్పబోయి వారి ఎదుట సాక్ష్యాలు ఉంచటంతో వాస్తవంలోకి వస్తున్నారు.
ఓర్నీ వేషాలో అనాల్సిందే..
పదేళ్లుగా కొకైన్, హెరాయిన్ వంటి ఖరీదైన డ్రగ్స్ తీసుకునే సినీ నటుడు అకస్మాత్తుగా మాట మార్చాడు. తాను అమాయకుడినంటూ బిక్కమొహం పెట్టాడు. పోలీసు విచారణ సమయంలో ఒళ్లంతా చెమట్లతో తడిసి ముద్దయిన అతడు బయట మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు.
- మాదాపూర్ రేవ్పార్టీలో ఐదు రకాల మాదకద్రవ్యాలు లభించాయి. కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్టు ఓ సినీ నిర్మాత రక్త నమూనాల ద్వారా బట్టబయలైంది. కళ్లెదుట ఇన్ని ఆధారాలున్నా తాను అమాయకుడినంటూ పోలీసు కస్టడీలో నానాయాగీ చేశాడు. హుద్రోగ సమస్యలున్నాయని వెంటనే చికిత్స చేయకుంటే ప్రమాదమంటూ ఏమార్చే యత్నం చేయబోయాడు.
- సినీరంగానికి చెందిన మరొకరు బుద్ధిగా వ్యాపార కార్యకలాపాలు చేసుకునే తనకు డ్రగ్స్ కేసు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించాడు. ఏ ఆధారాలతో నన్ను నిందితుడు అంటారంటూ నిలదీసినంత పనిచేసినట్టు తెలుస్తోంది. నాలుగైదేళ్ల క్రితం ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేసిన ఫొటోలు ముందుంచగానే అదంతా గతం సార్, ఇప్పుడు మారిపోయానంటూ కాళ్లబేరానికి వచ్చాడు. పోలీసు విచారణకు సహకరిస్తానంటూ వెళ్లిపోయాడు.
బాబోయ్.. నైజీరియన్లు
మాదకద్రవ్యాల కేసుల్లో విదేశీయులను విచారించటం పోలీసులకు సవాల్గా మారుతోంది. నిత్యం మత్తులో ఊగిపోయే నైజీరియన్లు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారనేది అంతుబట్టని విషయం. గంజాయి తీసుకోవటం తమ దేశంలో సాధారణమైన విషయమంటూ ఎదురుతిరుగుతారు. ఆంగ్లం మాట్లాడటం వచ్చినా రానట్టు నటిస్తారు. అనువాదకులను పిలిపించి వారి నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు. రోజూ బిర్యానీ కావాలంటూ డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు కేకలు, అరుపులతో హోరెత్తిస్తారు. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలంటూ కిందపడిపోతుంటారు. వీటన్నిటినీ తట్టుకొని వీరి నుంచి ఆధారాలు రాబట్టడం అంత తేలిక కాదంటారు నగర పోలీసులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్ను కట్ చేసిన సీఎం రేవంత్
[ 09-12-2023]
కాంగ్రెస్ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్రెడ్డి భేటీ
[ 09-12-2023]
నూతనంగా ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్రెడ్డి సన్మానించారు. -
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
[ 09-12-2023]
ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళిసై.. అక్బరుద్దీన్ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు. -
రావమ్మా.. మహాలక్ష్మి
[ 09-12-2023]
మహానగరం పరిధిలో ఏసీ బస్సుల్లో మినహా మిగిలిన 2727 బస్సుల్లో శనివారం నుంచి మహిళలు ఉచితంగా నగరమంతటా ప్రయాణించొచ్చు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సర్కారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నగరంలో ఆర్డినరీ, మెట్రో ఎక్ప్రెస్ బస్సులన్నింటిలో ఉచిత పథకాన్ని అమలులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
హెచ్ఎండీఏ అధికారుల్లో లోలోన ఆందోళన
[ 09-12-2023]
ఉస్మాన్సాగర్ పరిధిలోని వట్టినాగులపల్లిలో వివిధ సర్వే నంబర్లలో భూ వినియోగ మార్పిడిలు రెండు నెలల క్రితం భారీ ఎత్తున జరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 60-70 వరకు మార్పిడిలు చేశారు. వందల ఎకరాలు బహుళ వినియోగ జోన్లోకి తీసుకొస్తూ జీవోలు జారీ అయ్యాయి. -
పదేళ్ల పనితీరు.. భవిష్యత్తు ప్రణాళికలు
[ 09-12-2023]
-
మట్టి ప్రతిమ చాటున మత్తు దందా
[ 09-12-2023]
అమ్మవారి ప్రతిమ చాటున గంజాయి రవాణాకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల్ని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.28కోట్ల విలువైన 510 కిలోల గంజాయి, వాహనం, నగదు, స్వాధీనం చేసుకున్నారు. -
అర్జీదారులు.. ఆహ్వానంతో బారులు
[ 09-12-2023]
పింఛన్ కావాలంటూ కొందరు.. ఇళ్ల కోసం ఇంకొందరు.. ఉద్యోగం కావాలంటూ మరికొందరు.. జ్యోతిరావు ఫులె ప్రజా భవన్ (ప్రగతి భవన్)లో శుక్రవారం ప్రారంభమైన ప్రజా దర్బార్కు వందల మంది తరలివచ్చారు. -
సీటు పదిలమా.. స్థాన చలనమా!
[ 09-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. నగర పోలీసు వర్గాల్లో కలవరం పెంచింది.. సిఫార్సు లేఖలతో పోస్టింగ్లు సంపాదించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కొందరు తమపై పడిన పాత ముద్ర నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. -
కాలుష్య దుర్గం
[ 09-12-2023]
దుర్గం చెరువు కాలుష్య కాసారంలా మారిపోయింది. గృహ, పారిశ్రామిక వ్యర్థాల కలయికతో పూర్తి స్థాయిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్(డీవో) పడిపోయింది. లీటరు నీటిలో డీవో 4-6 మిల్లీగ్రాములు ఉండాలంటూ కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించగా.. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
[ 09-12-2023]
అప్పట్లో ఆ భవనంలోకి ప్రజలు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించేవారు. అనంతర పరిణామాలతో ప్రభుత్వాలు మారాయి. పదమూడేళ్లుగా ప్రజలకు దూరమైన ఆ భవనం ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఆహ్వానం పలుకుతోంది. -
‘మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరింపులు’
[ 09-12-2023]
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నా ఫోన్నంబరుతో తమ పార్టీ కార్పొరేటర్లకు ఫోన్ చేసి చంపేస్తామని, కుటుంబానికి హాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. -
చరవాణి ఇవ్వలేదని... స్నేహితుడి దారుణ హత్య
[ 09-12-2023]
బతుకుదెరువుకు సొంతూరు నుంచి వలసొచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య చరవాణి చిచ్చు పెట్టింది. స్నేహితుడిని చరవాణి అడిగితే ఇవ్వలేదన్న కోపంతో కూరగాయలు కోసే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. -
అల్పాహారం.. అరకొర!
[ 09-12-2023]
విద్యార్థుల ఆకలి తీర్చేందుకు భారాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది చిన్నారులకు వరంలా మారింది. అక్టోబరు 5వ తేదీన లాంఛనంగా జిల్లాలో నాలుగు బడుల్లో ప్రారంభించారు. -
అధిపతి.. దృష్టి సారిస్తే ప్రగతి
[ 09-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కొడంగల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ విద్య, ఉపాధి అవకాశాలు తక్కువ ఉండడంతో యువత నిరాశకు గురవుతున్నారు. ఇపుడు తాజాగా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
యూనిసెఫ్ సదస్సుకు నగర విద్యావేత్త
[ 09-12-2023]
దుబాయ్లో జరుగుతున్న యూనిసెఫ్ సదస్సుకు.. అంబర్పేట బాపూనగర్కు చెందిన ప్రగతి విద్యానికేతన్, కార్డినల్ స్కూల్ డైరెక్టర్, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం(ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యావేత్త ఎస్.మధుసూదన్ హాజరయ్యారు. -
పురాతన రాతి చిత్రాలు గుర్తింపు
[ 09-12-2023]
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండల పరిధి లింగాపూర్ ప్రాంతంలోని రాతి గుహలో 40కి పైగా ఎరుపు రంగుతో కూడిన రాతి చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నసీర్, అన్వర్, కొరివి గోపాల్ శుక్రవారం గుర్తించారు. -
మంత్రి వర్గంలోనూ సమన్యాయం పాటించాలి: జాజుల
[ 09-12-2023]
రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. -
కొత్త ఆవిష్కరణలు ల్యాబ్కే పరిమితం కావొద్దు
[ 09-12-2023]
ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు ల్యాబ్ వరకే పరిమితం కాకూడదని, వాటిని సమాజం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలదేనని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. -
ఉపకారవేతనాల బకాయిలు విడుదల చేయాలి
[ 09-12-2023]
బీసీ విద్యార్థులకు సంబంధించిన రూ. 5 వేల కోట్ల ఫీజు రియెంబర్స్మెంట్ సహా ఉపకారవేతనాల బకాయిలను సత్వరం విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ కోరారు. -
పెన్షనర్ల వినతులు నెరవేర్చాలి
[ 09-12-2023]
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమురెల్లి అన్నారు. -
కృత్రిమ మేధస్సులో పరిశోధనలు రావాలి
[ 09-12-2023]
పారిశ్రామిక రంగం, సమాజానికి ప్రయోజనం చేకూరేలా కృతిమ మేధస్సులో పరిశోధనలు జరగాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజిజెన్ (ఐఎస్బీ) డీన్ ప్రొ.మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
[ 09-12-2023]
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బస్భవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
వేలల్లో అర్జీలు.. వందల్లో ఇళ్లు
[ 09-12-2023]
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పట్టణ శివారులోని కేసీఆర్ నగర్లో నిర్మాణాలు చేపట్టింది. వాటిల్లో కొన్ని పూర్తయినా, మిగతావి అసంపూర్తిగా ఉన్నాయి. -
ఇస్తేమా నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 09-12-2023]
పరిగి మండల పరిధిలో జనవరి 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న ఇస్తేమా (ఇస్లాం ఆవశ్యకత గురించి నిర్వహించే) కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉద్యోగుల శుభాకాంక్షలు
[ 09-12-2023]
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన రేవంత్రెడ్డికి, మంత్రి వర్గ సభ్యులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా టీఎన్జీఓఎస్ ఉద్యోగులు నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు. -
మెథడిస్టు జాతరకు భక్తుల తాకిడి
[ 09-12-2023]
మెథడిస్టు క్రిష్టియన్ జాతరకు రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. బీదర్, జహీరాబాద్, మెదక్, సంగారెడ్డి, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ జాతర ప్రాంగణానికి చేరుకుంటున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే