స్ఫూర్తి ప్రదాత రోశయ్య
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
ప్రొద్దుటూరుతో అనుబంధం మరువరానిది
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధిలో రోశయ్య (దాచిన చిత్రం)
ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు పట్టణం, కడప విద్య, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
* రాష్ట్ర ఆర్థిక, వ్యవహారాలశాఖ మంత్రి హోదాలో 2005లో ప్రొద్దుటూరులో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రోశయ్య.. ఆర్యవైశ్య మహాసభ 125వ వార్షికోత్సవానికి వచ్చి శ్రీకన్యకా పరమేశ్వరీదేవికి వజ్ర కిరీటధారణ చేశారు. పెన్నాతీరంలో ఉన్న శ్రీఅయ్యప్ప స్వామి, అమృతేశ్వర స్వామి, వైఎంఆర్ కాలనీలోని సాయిబాబా ఆలయాలను ఆయన సందర్శించారు. ఆర్యవైశ్య సభ దివ్య శతాధిక రజతోత్సవాల్లో పాల్గొన్నారు. సావనీరు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
* గొప్ప వ్యక్తిని కోల్పోయామని తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు చిప్పగిరి వెంకట ప్రసాద్ కుమార్ శెట్టి కొనియాడారు. ఆయనతో తనకు 25 ఏళ్ల పాటు అనుబంధం ఉందని, నా రాజకీయ గురువు, మార్గదర్శి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు, సభ కార్యవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని వాసవీ మాతను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరనిలోటని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా, రాష్ట్ర గవర్నర్గా విశేష సేవలు అందించారని కొనియాడారు.
* రాజకీయాల్లో అజాత శత్రువుగా విమర్శకులను సైతం మెప్పించిన మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నరు రోశయ్య మృతి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి తెలిపారు. 1989 నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు పాతతరం రాజకీయాల్లో విశేష అనుభవంతో వివాదాస్పదం లేనివిధంగా రోశయ్య అందరి మన్ననలు పొందారన్నారు.
ప్రొద్దుటూరు : గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకం వద్ద నాటి ఆర్థిక మంత్రి రోశయ్య, జిల్లా నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ