ఆపన్నులకు అండ... సేవల దండ
ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరో వైపు సమాజ సేవలో స్వచ్ఛందంగా పాల్గొంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు కొందరు ఉద్యోగులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని నిరుపేదలు, యాచకులకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సమకూర్చుతూ ఆదుకుంటున్నారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
నేడు స్వచ్ఛంద సేవకుల దినోత్సవం
అనాథకు క్షవరం చేస్తున్న రామకృష్ణారెడ్డి
ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరో వైపు సమాజ సేవలో స్వచ్ఛందంగా పాల్గొంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు కొందరు ఉద్యోగులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని నిరుపేదలు, యాచకులకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సమకూర్చుతూ ఆదుకుంటున్నారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర సమయాల్లోనూ నిత్యావసరాలు అందిస్తూ తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే...
- న్యూస్టుడే, యోగి వేమన విశ్వవిద్యాలయం
మూడు వేల మంది విద్యార్థులకు చదువు...
కలసపాడు మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన పాపిజెన్ని రామకృష్ణారెడ్డి రైల్వే విభాగంలో చిరుద్యోగం చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇతను 2010లో వివేకానంద సేవాశ్రమాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదట్లో యువకుల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో వివేకానందుని బోధనలపై ప్రచారం నిర్వహించారు. రక్తదానం, సామాజిక బాధ్యత తదితర అంశాలపై విద్యార్థులకు చైతన్యం కలిగిస్తున్నారు. జీతంలో 80 శాతం పైగా సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు. పేదలు, అనాథలైన మూడు వేల మంది విద్యార్థులకు చదువుపరంగా చేయూతనిచ్చారు. రోడ్డుపక్కన ఉన్న అభాగ్యులను ఆదుకుంటూ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో కాశినాయన మండలం ఓబుళాపురం గ్రామం పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, నిస్సహాయుల కోసం ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్తో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించారు.
నాలుగు నెలల జీతం విరాళం
కడప నగర శివారులోని ఎర్రమాచుపల్లెకి చెందిన పట్టెం కిరణ్ గంగిరెడ్డి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇతని స్వస్థలం అట్లూరు మండలం చెండువాయి. 2009లో అమృత హస్తం సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు యువత, రైతులకు అవగాహన, మంత్రణం ఇస్తున్నారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వందల సంఖ్యలో అవగాహన సదస్సులు నిర్వహించారు. 11 ఏళ్లుగా అలుపెరగకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మందపల్లె, పులపుత్తూరు గ్రామస్థులకు నాలుగు నెలల జీవితాన్ని విరాళంగా అందించారు. రూ.50 వేల నిత్యావసరాలను కూడా సమకూర్చారు. ఇతర సంస్థల ప్రతినిధులతో కలిసి రూ.3 లక్షల మేర నిధులు సేకరించి వరద బాధితులకు అందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో దోసెడు బియ్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి 1000 కిలోల బియ్యం సేకరించి బాధితులకు అందించారు.
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరమాత్మా
సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మలిశెట్టి వెంకటరమణ
600 మందికి అంత్యక్రియలు...
కడప నగర శివారులోని సుబ్బన్నగారి పల్లి నివాసి అయిన మలిశెట్టి వెంకటరమణ నందలూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. మొదట్లో విధుల్లో భాగంగా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్డి కొట్టాల గ్రామంలో ఒక అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలకు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత 50 నుంచి 60 మంది వరకు అంత్యక్రియలు నిర్వహించారు. 2006లో పరమాత్మా సేవా సంస్థను స్థాపించి అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 597 మందికి అంత్యక్రియలు చేశారు. 1993లో ఒక్కో అంత్యక్రియకు అయ్యే ఖర్చు రూ.600గా ఉండేదని, ఇప్పుడు ఒక్కో అంత్యక్రియకు దాదాపు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు అవుతోందన్నారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం తనకు వచ్చే జీతం నుంచే భరిస్తున్నాని రమణ తెలిపారు. ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశాడు. సిద్దవటం, భాకరాపేట మధ్య పరమాత్మా సేవా నిరాధారుల ఆశ్రయం స్థాపించి 26 మందికి ఆశ్రయం ఇస్తున్నారు.
కువైట్లో ఉంటూ...
ఒంటిమిట్ట మండలానికి చెందిన సిద్దవటం నాగముని మొదట్లో చలివేంద్రాలు నిర్వహించేవారు. ఒంటిమిట్ట, సిద్దవటం, బద్వేలు మండలాల్లోని పేదలకు ఆర్థిక సహాయం అందించారు. తరువాత తన జీవన భృతి, కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన నాగముని సేవా కార్యక్రమాలు ఆగకుండా ఉండేందుకు మేము సైతం సేవా సంస్థను స్థాపించి అందులో వాలంటీర్లను నియమించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. కువైట్లో ఇబ్బంది పడుతున్న వారికి వసతి, అవుట్పాస్ ఇప్పించి ఇండియాకు పంపడం, జిల్లాలోని వివిధ వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు, ఇతర సామగ్రి అందిస్తున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు, వస్త్రాలు అందించారు. కరోనా సమయంలో మాస్కులు, మందులు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయిన మందపల్లె, పులపుత్తూరు గ్రామవాసులకు రూ.1.25 లక్షల నిత్యావసర సరకులు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్