రాజకీయ చట్రంలో రక్షణ గోడ
రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు.
నిర్మించకుండా విమర్శలతోనే కాలయాపన
కూలిన ఇల్లు
-న్యూస్టుడే, రైల్వేకోడూరు రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. శేషాచలం అడవుల నుంచి వరద పోటెత్తిన ప్రతిసారీ ఇక్కడ ఏటి ఒడ్డున ఉన్న నివాసాలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటూనే ఉన్నాయి.
గత ప్రభుత్వంలోనే నరసరాంపేటకు రూ.21.87 కోట్లతో రక్షణ గోడ మంజూరైంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ప్రజలు ఇబ్బంది పడడానికి ఇప్పటి నేతలే కారణం.- బత్యాల చెంగల్రాయుడు,
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి
సుమారు 12 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఇక్కడి నేత ఒకరు నరసరాంపేటకు రక్షణ గోడ నిర్మించలేకపోయారు. ఆ వైఫల్యాన్ని మా మీదకు తోసే ప్రయత్నం మంచిది కాదు. జగన్ ప్రభుత్వంలో రూ.37 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తాం.
- కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
పక్కా గృహాలకు ప్రణాళిక : నరసరాంపేటలో మొత్తం 21 నివాసాలు అత్యంత ప్రమాదకరమని గుర్తించాం. 16 కుటుంబాల వారికి ఇప్పటికే ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. మరో అయిదుగురికి విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న కారణంతో జాగా మంజూరు కాలేదు. అందరికీ పక్కా గృహాలు కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాం. - రామమోహన్, తహసీల్దారు
రూ.37 కోట్లతో నివేదిక: రక్షణ గోడ నిర్మించడానికి రూ.37 కోట్లతో అంచనా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. నిధులు, అనుమతులు రాగానే పనులు చేపడతాం. - చెంగల్రాయుడు, డీఈ, నీటిపారుదలశాఖ
సమస్యను విన్నవిస్తూనే ఉన్నాం
ఓట్లకు వచ్చిన ప్రతి నాయకుడికీ మా సమస్యలు విన్నవిస్తూనే ఉన్నాం. మాటలు చెప్పడం తప్ప రక్షణ గోడ నిర్మించలేదు. నీటి ఉద్ధృతికి మా రెండంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. పిల్లా పాపలతో నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.
- షేక్ నూర్జహాన్, ఆయేషా
మాటలతో సరిపెడుతున్నారు
వర్షం కురిసిన ప్రతిసారీ ఇక్కడ గండమే. ఇళ్లు కొద్దికొద్దిగా ఏట్లోకి జారిపోతుంటే ప్రాణాలు అరచేత పట్టుకుని వీధుల్లోనే ఉంటున్నాం. అందరం పేదవాళ్లం. ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకుని గోడ కట్టిస్తే ఏట్లోని నీళ్లు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు
- రామాంజులమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా